ఇండియా కూటమిలోకి రండి - ఏపీలో గెలిచే ఎంపీలకు మాజీ కేంద్రమంత్రి ఆహ్వానం..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో ఐదు రోజుల్లో వెలువడబోతున్నాయి. మరోవైపు జాతీయ స్ధాయిలో ఈసారి ఎన్డీయే కూటమికి తగినన్ని సీట్లు లభించే అవకాశం లేదని పలువురు సెఫాలజిస్టులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో అధికారం చేపట్టేందుకు అవకాశం లభిస్తే తయారుగా ఉండాలన్న చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై చర్చించేందుకు జూన్ 1న ఇండియా కూటమి పార్టీలు కీలక భేటీ కూడా ఏర్పాటు చేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీలో అధికార వైసీపీతో పాటు విపక్షంలో ఉన్న పార్టీలకు సైతం కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని కేంద్రంలో ఇండీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ కు చెందిన కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఈసారి గెలవబోయే ఎంపీలకు కీలక ఆఫర్ ఇచ్చారు. వీరంతా ఇండీ కూటమిలో చేరితే రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు అన్ని ప్రయోజనాలు సాధించుకోవచ్చని కోరారు.

ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఈసారి గెలవబోయే ఎంపీలంతా ఇండియా కూటమిలోకి రావాలని ఆయన కోరారు. అప్పుడు ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలో అన్ని హామీలు సాధించుకునేందుకు వీలుంటుందన్నారు. అలాగే తిరుపతిని రాజధానిగా చేయాలని తన పాత డిమాండ్ కూడా తెరపైకి తెచ్చారు. అంతర్జాతీయ ఎయిర్ పోర్టు సహా మౌలిక వసతులు ఇక్కడ ఉన్నాయన్నారు. తిరుపతిని రాజధాని చేస్తే సీమకు న్యాయం జరుగుతుందన్నారు. కాబట్టి అన్ని పార్టీలు ఈ ప్రతిపాదనకు అంగీకరించాలన్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications