మండలిలో 'చీకటి' రోజు.. బయటపడ్డ వైసీపీ అరాచకాలు!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని 'అమరావతి' చుట్టూ జరుగుతున్న పరిణామాలు చరిత్రలో నిలిచిపోయే సమయంలో, శాసనమండలి మాజీ చైర్మన్ ఎం.ఏ. షరీఫ్ చేసిన తాజా వ్యాఖ్యలు షాక్ కు గురిచేశాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల బిల్లు సందర్భంగా మండలిలో జరిగిన 'చీకటి' పరిణామాలను ఆయన తొలిసారి బయటపెట్టారు. ఆనాడు కెమెరాలు కట్ చేసిన తర్వాత సభలో చోటు చేసుకున్న అవమానాలు, బెదిరింపులను వివరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి.
అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించిన శుభవేళ.. శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ గతంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను నెమరువేసుకున్నారు. మూడు రాజధానుల బిల్లును అడ్డుకున్నందుకు తనపై భౌతిక దాడులకు ప్రయత్నించడమే కాకుండా, తన పుట్టుకను కూడా అవమానించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాడు సభలో లైవ్ కవరేజీ ఆపేసిన తర్వాత జరిగిన భయానక వాతావరణాన్ని ఆయన వివరించారు.

నిందించారు.. చేయి చేసుకున్నారు!
నాడు సభలో ఏం జరిగిందో వివరిస్తూ.. "మూడు రాజధానుల బిల్లును నేను ఆమోదించకపోవడంతో వైసీపీ సభ్యులు ఉన్మాదుల్లా ప్రవర్తించారు. ఒక మంత్రి నాపై చేయి చేసుకున్నారు. మరో మంత్రి అయితే సభ్య సమాజం తలదించుకునేలా నన్ను దూషిస్తూ.. నా పుట్టుకను కూడా నిందించారు. మార్షల్స్ గానీ, సభ సిబ్బంది గానీ నా దగ్గరకు రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. చుట్టుముట్టి నాపైకి దూసుకొచ్చారు" అని షరీఫ్ సంచలన ఆరోపణలు చేశారు.
ప్రలోభాలు.. బెదిరింపుల పర్వం.
కేవలం తిట్లు, దాడులతోనే ఆగిపోలేదని.. తనను లొంగదీసుకోవడానికి ప్రలోభాలకు కూడా తెరలేపారని ఆయన పేర్కొన్నారు. "నీ దగ్గర డబ్బు లేదు కదా.. మాతో కలిస్తే నీకు బతుకుదెరువు చూపిస్తాం" అని ఆశ చూపారని, అది పని చేయకపోవడంతో.. "బిల్లు ఆమోదించకపోతే ఈ శాసనమండలినే రద్దు చేస్తాం" అని అప్పటి ప్రభుత్వం తనను తీవ్రంగా బెదిరించిందని షరీఫ్ వెల్లడించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ధర్మం వైపు నిలబడాలనే ఉద్దేశంతోనే ఆనాడు తాను బిల్లును వెనక్కి పంపినట్లు స్పష్టం చేశారు.
అమరావతి విజయం.. నాకెంతో సంతోషం..
"నాడు నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఈరోజు పార్లమెంటులో అమరావతికి లభించిన చట్టబద్ధత నిరూపించింది. రాజధాని కోసం రైతులు, మహిళలు చేసిన సుదీర్ఘ పోరాటం ఫలించింది. ప్రజాస్వామ్యంలో ధర్మానిదే విజయం అని నేడు నిరూపితమైంది. అమరావతి శాశ్వత రాజధానిగా చట్టం రూపుదిద్దుకోవడం నాకు వ్యక్తిగతంగా ఎంతో సంతోషాన్ని ఇస్తోంది" అని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
షరీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నాడు సభలో ప్రవర్తించిన ఆ మంత్రులు ఎవరనే చర్చ మొదలైంది. అమరావతి అన్ స్టాపబుల్ గా ముందుకు సాగుతున్న తరుణంలో, షరీఫ్ చేసిన ఈ 'ఫ్లాష్ బ్యాక్' వ్యాఖ్యలు అప్పటి వైసీపీ వైఖరిని మరోసారి ఎండగట్టేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
-
రాజ్యసభలో అమరావతి బిల్లుపై రూటు మార్చిన వైసీపీ, అనూహ్య డిమాండ్..!! -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
సాష్టాంగ ప్రణామం.. ఆంధ్రుల ఆత్మగౌరవానికి దక్కిన విజయం -
Amaravati Bill: అమరావతి గొంతుకనవుతా..! సాయిరెడ్డి బిగ్ ట్విస్ట్..! -
జగన్ 'మావిగన్' ప్రతిపాదన వెనుక, కూటమి నేతలకు చంద్రబాబు కీలక పిలుపు..!! -
అమరావతి బిల్లు పై పార్లమెంట్ లో వైసీపీ బిగ్ ట్విస్ట్..!! -
అమరావతిపై జగన్ ప్లాన్ 'బీ' - కొత్త రాజధాని “మావిగన్”..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!! -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
అమరావతిపై జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్.. అంగుళం కూడా కదల్చలేవ్ -
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
భారీ వర్షాలు, పిడుగులు, ఈదురు గాలులు - బీ అలర్ట్.. ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..!













Click it and Unblock the Notifications