వర్ల.. దురహంకారాన్ని తగ్గించుకో!, తక్షణం క్షమాపణ చెప్పు: మాజీ మంత్రి రావెల
గుంటూరు: దళిత ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో ఇతరుల జోక్యం మంచిది కాదన్నారు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు. దాని వల్ల దళిత జాతిలో అభద్రతా భావం పెరుగుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని చోట్లా ఇదే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.
తన నియోజకవర్గంలో మంత్రి పుల్లారావు అనుచరుల జోక్యం ఏంటని ప్రశ్నించారు రావెల. ఇక ఓ మాదిగ విద్యార్థి పట్ల దురుసుగా వ్యవహరించిన ఆర్టీసి ఛైర్మన్ వర్ల రామయ్యపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారాయన. వర్ల రామయ్య వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని, వర్ల దురహంకారాన్ని తగ్గించుకోవాలని హెచ్చరించారు.

వర్ల తక్షణమే మాదిగ జాతికి క్షమాపణ చెప్పాలని రావెల డిమాండ్ చేశారు. మాదిగలంతా దీనిపై ఉద్యమానికి సిద్దం కాకముందే వర్ల తన తప్పును సరిదిద్దుకోవాలని ఆయన హితవు పలికారు. జిల్లాలో అధికారులు తన మాట వినడం లేదని, వారి ఏకపక్ష పోకడలపై త్వరలోనే సీఎంకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి దళితులను అక్కున చేర్చుకుంటే.. నేడు వారిపైనే దాడులు జరుగుతుండటం సరైందని కాదని అన్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications