బాబు దెబ్బ: బిజెపికి మాజీ ఎమ్మెల్యే పట్నం సుబ్బయ్య రాజీనామా, టిడిపిలో చేరిక, క్యూలో మరికొందరు
అమరావతి: బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం సుబ్బయ్య టిడిపిలో చేరారు. మంగళవారం రాత్రి అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో పట్నం సుబ్బయ్య టిడిపిలో చేరారు. మరికొందరు బిజెపి నేతలు కూడ త్వరలో టిడిపిలో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఏపీలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేసుకొనే దిశగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చర్యలు చేపడుతున్నారు. ఇతర పార్టీల్లోని బలమైన నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ వల వేస్తున్నారు.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల నుండి ఫిరాయింపులు కూడ పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..
రాజకీయంగా రానున్న రోజుల్లో అనేక మార్పులు చేర్పులు సంభవించే అవకాశం ఉందంటున్నారు నేతలు.

పట్నం సుబ్బయ్య టిడిపిలో చేరిక
మాజీ ఎమ్మెల్యే చిత్తూరు జిల్లాకు చెందిన బిజెపి నేత పట్నం సుబ్బయ్య ఆ పార్టీకి రాజీనామా చేసి మంగళవారం రాత్రి టిడిపిలో చేరారు. తన అనుచరులతో కలిసి సుబ్బయ్య టిడిపిలో చేరారు. మంత్రి అమర్నాథ్ రెడ్డి పట్నం సుబ్బయ్య టిడిపిలో చేరేలా చక్రం తిప్పారని టిడిపి వర్గాల్లో ప్రచారంలో ఉంది.

బిజెపి నుండి వలసలు
ఏపీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. బిజెపితో పొత్తును టిడిపి తెగదెంపులు చేసుకోవాలని భావిస్తోంది.కొందరు బిజెపి నేతలు టిడిపిలో చేరేందుకు సన్నాహలు చేసుకొంటున్నారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే రాజకీయంగా బిజెపికి నష్టమే..

బిజెపిని విలన్గా చూపుతున్న పార్టీలు
ఏపీ రాష్ట్రానికి ఎన్నికల సమయంలో ఇస్తానన్న హమీలతో పాటు ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలను అమలు చేయాలని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. బిజెపికి మిత్రపక్షంగా ఉన్న టిడిపి కూడ ఇదే అంశాలను ప్రస్తావిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు బిజెపి పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కల్గించేలా చేసింది. ఈ పరిణామాలు రాజకీయంగా తమకు నష్టం చేస్తున్నాయని బిజెపి నేతలు అభిప్రాయపడుతున్నారు.

బిజెపికి దెబ్బేనా
2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు బిజెపిలో చేరారు. ఆ ఎన్నికల సమయంలో కొందరు పోటీ చేశారు. మరికొందరు పోటీ చేసే అవకాశం దక్కలేదు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు మాత్రం బిజెపికి అనుకూలంగా లేవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. ఈ పరిణామాలు బిజెపికి నష్టం చేసే విధంగా ఉన్నాయి. అయితే రాజకీయంగా దెబ్బతినకుండా ఉండేందుకు బిజెపి ప్రయత్నాలను చేస్తోంది.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications