నన్ను అపాలంటే చంపాల్సిందే-తీహార్ నుంచైనా గెలుస్తా- అఖిలప్రియ కామెంట్స్..
ఏపీలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో భాగమైన నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో తిరిగి పట్టు కోసం ప్రయత్నిస్తున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సొంత పార్టీ టీడీపీలో ప్రత్యర్ధులతో పాటు వైసీపీ నుంచి పెనుసవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పార్టీలో తన ప్రత్యర్ధి ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో అఖిలప్రియపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపారు. అయితే కోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్న అఖిలప్రియ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆళ్ళగడ్డ ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటానని, వారికి ఎప్పుడూ రుణ పడి ఉంటానని భూమా అఖిలప్రియ తెలిపారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ ల కింద ఇద్దరం ఒకరిపై ఒకరు కేసు పెట్టుకున్నప్పుడు తనను మాత్రమే ఎందుకు ఆరెస్ట్ చేశారని ఏవీ సుబ్బారెడ్డి కేసులో పోలీసుల తీరుపై అఖిలప్రియ అభ్యంతరం తెలిపారు. తన భర్త భార్గవ్ రామ్ అస్సలు సంఘటన జరిగిన చోటే లేడని, కానీ ఆయన మీద కూడా కేసు పెట్టారని ఆరోపించారు. ఆళ్లగడ్డలోనే కాదు, నంద్యాలలో కూడా ఇంటింటికీ తిరుగుతానని ఈ సందర్భంగా అఖిల తెలిపారు.

తెలంగాణ పోలీసులు ఒక అమ్మాయి విషయంలో అన్యాయం జరిగితే నిందితులను కాల్చి చంపితే శబాష్ అని మనమే అన్నామని, కానీ ఇక్కడ పరిస్ధితి వేరుగా ఉందని అఖిల తెలిపారు. ప్రజల నుంచి తనను దూరం చేయాలని చూస్తున్నారని అఖిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ కేసులకు భయపడనన్నారు. తనను ఆపాలని చూస్తే చంపడం తప్ప మరేమీ చేయలేరన్నారు. ప్రజలే తన దేవుళ్ళని, ప్రజలే తన దిక్కని అఖిల ప్రియ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. మహిళా హోంమంత్రి మహిళలకు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఒక ఆడపిల్ల మీద చెయ్యి వేయాలంటే భయపడాలన్నారు.
ఎన్ని ఇబ్బందులు వచ్చిన,ఎన్ని కష్టాలు పెట్టినా తనను తీహార్ జైల్లో వేసినా జైల్ నుంచి నామినేషన్ వేసి గెలుస్తానని అఖిలప్రియ ధీమా వ్యక్తం చేశారు. మీరు ఎన్ని కుట్రలు చేసిన నేను పార్టీకి ఇంకా దగ్గర అవుతున్నా అని ప్రత్యర్ధుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజలు మిమ్మల్ని స్వాగతించడం పక్కన పెట్టి మహిళలు కొడతారన్నారు. తనను ఇబ్బంది పెట్టిన ఒకరి మీదనే తాను కేసు పెట్టానని, కానీ నాతో పాటు 10 మంది పైన కేసు పెట్టినావంటూ ఏవీ సుబ్బారెడ్డిని ఉద్దేశించి అన్నారు.
పోలీసు అధికారులకు ఏవి సుబ్బారెడ్డి మీద ఎందుకు అంత ప్రేమ అని అఖిల ప్రశ్నించారు. డిపార్ట్మెంట్ వాళ్లు డబ్బు తీసుకున్నారా, లేక వాళ్ళకి ఏమైనా లోబడి పని చేసారా అని అడిగారు. ఏవీ సుబ్బారెడ్డి అస్సలు పార్టీలో ఉన్నారా అని ప్రశ్నించారు. పార్టీలో ఉంటే అతను పార్టీ కోసం ఈ నాలుగు సంవత్సరాలు ఏం చేశాడని నిలదీశారు. ఎవరైతే గుంట నక్కలు ఉన్నారో వాళ్ళ గురించి నారా లోకేష్ చూసుకుంటాడన్నారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications