అమరావతి మహా పాదయాత్రకు రేణుకా చౌదరి మద్దతు- జగన్ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు
అమరావతిలో రైతులు చేపట్టిన మహా పాదయాత్ర తుళ్లూరు నుంచి ఈ ఉదయం బయలుదేరింది. న్యాయస్ధానం టూ దేవస్ధానం పేరుతో మొదలైన ఈ యాత్ర తుళ్లూరు నుంచి తిరుమల వరకూ కొనసాగబోతోంది. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన డిసెంబర్ 19న ఈ యాత్ర తిరుమలలో ముగియబోతోంది. దీనికి విపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇదే క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కూడా సంఘీభావం తెలిపారు.
అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం ప్రకటించేందుకు ఖమ్మం జిల్లా నుంచి బయలుదేరిన రేణుకా చౌదరికి
కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ వద్ద కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి, కొండపల్లి బొమ్మను జ్ఞాపికగా ఇచ్చారు. ఈ సందర్భంగా అమరావతి రైతుల పాదయాత్ర, జగన్ సర్కార్ పై రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు అమరావతి వెళ్తున్నానని రేణుక తెలిపారు. రైతులు దేశానికి వెన్నెముక అని, అలాంటి రైతులను ప్రభుత్వం కంటతడి పెట్టిస్తోందంటూ మండిపడ్డారు.

అమరావతి మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళుతుంటే పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకుంటున్నారని రేణుకా చౌదరి ఆరోపించారు. నేను సైనికుడి కూతురిని...దేశంలో ఎక్కడైనా పర్యటిస్తా...నాకు భయం అంటే ఏంటో తెలియదని రేణుక వ్యాఖ్యానించారు. అమరావతి రైతులకు కాంగ్రెస్ పార్టీ ఎపుడు మద్దతుగా ఉంటుందన్నారు.
అమరావతి మహా పాదయాత్రకు రేణుకా చౌదరి మద్దతు- జగన్ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు #andhrapradesh, #AmaravatiFarmersMarch , #farmers, #mahapadayatra, #renukachowdary pic.twitter.com/aD8HyU2AWn
— oneindiatelugu (@oneindiatelugu) November 1, 2021
అమరావతి మహా పాదయాత్రకు రేణుకా చౌదరి మద్దతు- జగన్ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు #andhrapradesh, #AmaravatiFarmersMarch , #farmers, #mahapadayatra, #renukachowdary pic.twitter.com/1qsmKJN7BE
— oneindiatelugu (@oneindiatelugu) November 1, 2021
అమరావతి ఉద్యమంలో మహిళల పాత్ర అమోఘమన్నారు. మహిళల చేతులకు ఉన్నవి గాజులుకావు,విష్ణు చక్రాలంటూ రేణుక వ్యాఖ్యానించారు. ఓటుతో ఏపీ ప్రభుత్వానికి మహిళలు బుద్ధి చెబుతారని రేణుక తెలిపారు. వైసీపీ సర్కార్ రైతులు రోడ్డెక్కే పరిస్ధితులు తీసుకొచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
-
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య..












Click it and Unblock the Notifications