కాళ్లు మొక్కినొళ్లే వెన్నుపోటు పొడిచారు ! ఎన్టీఆర్ ఎపిసోడ్ పై వెంకయ్య సంచలన వ్యాఖ్యలు
రాజకీయాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవజ్ఞుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇవాళ అదే రాజకీయాలు ఎలా ఉంటాయో తనదైన శైలిలో వివరించారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వెంకయ్య.. ఏపీ రాజకీయాలపైనే సెటైర్లు వేశారు.
పెనమలూరులో మన గ్రామం సహజ ఉత్పత్తుల కేంద్రాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన దివంగత సీఎం ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ పైఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వెంకయ్య కాళ్లకు కొందరు మహిళలు నమస్కరించారు. దీంతో ఆయన ఓశారి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అందులో ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ వచ్చేసింది.

ఎన్టీఆర్ ఇంట్లో కూర్చున్న సమయంలో కొందరు మహిళలు ఆయనకు నమస్కరించారని, ఎందుకు నమస్కరించారని తాను ఎన్టీఆర్ ను అడిగానని వెంకయ్య తెలిపారు. నాపై వారికున్న ప్రేమ, అభిమానం అని ఎన్టీఆర్ బదులిచ్చారన్నారు. అయితే అభిమానమా...పిండాకూడా అంతా ఒట్టిదేనని తాను చెప్పానన్నారు.

సీన్ కట్ చేస్తే ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ లో ఆ ఆరుగురే ముందున్నారని వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ ఆరుగురు మహిళలు ఎవరో మాత్రం వెంకయ్య చెప్పలేదు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications