రాజుగారికి గవర్నర్ గిరీ- మాజీ ఎంపీ కేశినేని నాని ట్వీట్..!
ఏపీలో టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అయిన అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్ గా నియమిస్తూ కేంద్రం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీలో అత్యంత సీనియర్ నేతల్లో ఒకరైన అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కడంపై ఒకప్పటి ఆయన సహచరుడు, విజయవాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) కూడా స్పందించారు.
గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు గారి నియామకాన్ని అభినందిస్తున్నానంటూ కేశినేని నాని ఇవాళ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, ఆర్థిక, రెవెన్యూ మంత్రిగా, కేంద్ర పౌర విమానయాన మంత్రిగా 35+ సంవత్సరాలుగా ఆయన చేసిన విశిష్ట ప్రజా సేవ బలమైన పరిపాలనా చతురత, సమగ్రతను ప్రతిబింబిస్తుందని కేశినేని తెలిపారు. ఆయన సూత్రప్రాయ నాయకత్వం నుండి గోవా ప్రయోజనం పొందుతుందని కేశినేని ఆకాంక్షించారు.

Appreciate the appointment of Ashok Gajapathi Raju Garu as the Governor of Goa.
— Kesineni Nani (@kesineni_nani) July 14, 2025
His distinguished public service spanning 45 years as MLA, Minister for Commercial Taxes, Excise, Finance, and Revenue in Andhra Pradesh, and as Union Minister for civil aviation reflects strong… pic.twitter.com/99HoC8zHyi
గతంలో 2014-19 మధ్య కేశినేని నాని విజయవాడ ఎంపీగా పార్లమెంట్ కు ఎన్నిక కాగా.. విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు అదే పార్టీ నుంచి గెలుపొందారు. అంతే కాదు అశోక్ గజపతిరాజు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా కూడా సేవలు అందించారు. అప్పట్లో టీడీపీ సీనియర్ గా ఉన్న అశోక్ గజపతిరాజు.. కేశినేని నాని వంటి జూనియర్లను కలుపుకుంటూ వెళ్లేవారు. దీంతో ఇవాళ గోవా గవర్నర్ గా అశోక్ ను నియమించగానే కేశినేని నాని సంతోషంగా శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాక నాని రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications