మూడు ఓట్లు నిజమే.. కానీ- వైసీపీ మాజీ మంత్రి అనిల్ క్లారిటీ..!
2019 ఎన్నికలకు ముందే తనపేరు మీద మూడు ఓట్లు ఉన్నాయని వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ నిర్ధారించారు. ఆయనకు మూడు ఓట్లు ఉన్నాయంటూ తాజాగా విపక్షాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఇవాళ అనిల్ స్పందించారు. తన పేరు మీద మూడు ఓట్లు ఉన్నాయంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, కానీ తాను ఈ విషయాన్ని 2019 ఎన్నికలకు ముందే ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు అనిల్ తెలిపారు
2019 ఎన్నికల సమయలో తన పేరు మీద మూడు ఓట్లు ఉన్నట్లు గుర్తించి తన ఇంటి పేరు మీద ఉన్నది కాకుండా మిగతా రెండు ఓట్లు తొలగించాలని నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు ఈసీకి తాను డిక్లరేషన్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు సీపీఐ రామకృష్ణ చేసిన ఆరోపణల్ని ఆయన ఖండించారు. దేవుడి దయవల్ల తనకు దొంగ ఓట్లు వేయాల్సిన అవసరం లేదని ఆయనకు గుర్తుచేశారు.

2019 ఎలక్షన్స్ ముందే నా పేరు మీద మూడు ఓట్లు ఉన్నాయి అని ఎలక్షన్ కమిషన్ కి లెటర్ రాయడం జరిగిందని, మిగతా ఓట్లతో నాకు సంబంధం లేదు అని ఎలక్షన్ కమిషన్ దగ్గర 2019లోనే ఒక డిక్లరేషన్ తీసుకోవడం జరిగిందని అనిల్ ఇవాళ వెల్లడించారు. చేతకాక విపక్షాలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయని అనిల్ విమర్శించారు. టీడీపీ నేతలు, కమ్యూనిస్టు నేతలు తనపై కావాలనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications