సాయిరెడ్డి మరో బిగ్ ట్విస్ట్..! కాంగ్రెస్ అధ్యక్షుడికి సంకేతం..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత మాత్రం మనసు మార్చుకున్నారు. వైసీపీకీ, ఎంపీ పదవికీ, రాజకీయాలకూ ఒకేసారి గుడ్ బై చెప్పేసి వ్యవసాయం చేసుకోవాలని నిర్ణయించారు. అయితే ఉన్నట్లుండి ఏపీ మద్యం స్కాంలో సాక్షిగా వెళ్లి విచారణకు సహకరించి వచ్చారు. ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్ కు తిరిగి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరిగింది.
ఇలా ఎప్పటికప్పుడు ట్విస్ట్ లు ఇస్తున్న విజయసాయిరెడ్డి.. ఇవాళ మరో ట్విస్ట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతెత్తున లేచే సాయిరెడ్డి.. ఇవాళ మాత్రం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గేకు ఓ ట్వీట్ పెట్టారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ నేతలపై విమర్శలకే పరిమితమైన సాయిరెడ్డి.. ఇవాళ మాత్రం అనూహ్యంగా ఖర్గేకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశారు. దీంతో సాయిరెడ్డి ట్వీట్ వైరల్ అవుతోంది.

దేశంలోని అత్యంత సీనియర్ రాజకీయ నాయకులలో ఒకరు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గేకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఆయనకు మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని, దేశానికి నిరంతర సేవ చేయాలని కోరుకుంటున్నానని కూడా అందులో పేర్కొన్నారు. దీంతో సాయిరెడ్డి ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Warm birthday wishes to Shri Mallikarjun Kharge Ji, one of the senior-most politicians in the country and the Leader of the Opposition in Rajya Sabha. Wishing him good health, happiness, and continued service to the nation.@kharge #MallikarjunKharge #RajyaSabha… pic.twitter.com/Rm7rnkl67k
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 21, 2025
మరోవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనందున, కార్యకలాపాలు నిర్మాణాత్మకంగా, అంతరాయం లేకుండా కొనసాగాలని ఆశిస్తున్నట్లు మరో ట్వీట్ చేశారు. గందరగోళం, వాయిదాల ద్వారా పట్టాలు తప్పకుండా, చర్చ ద్వారా ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచినప్పుడు ప్రజాస్వామ్యం ఉత్తమంగా పనిచేస్తుందని సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కూడా ప్రధాన విపక్షమైన కాంగ్రెస్ పార్టీకి కీలక సూచన చేస్తున్నట్లుగా ఉందన్న చర్చ జరుగుతోంది.
As the #MonsoonSession2025 of Parliament has commenced, I hope the proceedings remain constructive and uninterrupted. Democracy is best served when the Government is held accountable through debate, not derailed by disorder and adjournments.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 21, 2025
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పార్టీని ఎదిరించి బయటికి వచ్చి సొంత పార్టీ పెట్టుకున్న జగన్ కు ఆయన వద్ద ఆడిటర్ గా ఉన్న సాయిరెడ్డి అన్ని విధాలా అండగా నిలిచారు. అంతే కాదు ఢిల్లీలోనూ వైసీపీ తరఫున లాబీయింగ్ చేస్తూ ఏకంగా ప్రధాని కార్యాలయంలోనే పట్టు సంపాదించారు. చివరికి అదే వైసీపీని వీడి ట్విస్ట్ ఇచ్చారు. దీంతో సాయిరెడ్డి చంద్రబాబు కోసమే వైసీపీనీ, మూడున్నరేళ్ల గడువున్న ఎంపీ పదవినీ వదిలేశారంటూ జగన్ విమర్శలు గుప్పించారు.
-
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణాలో వైద్య సేవలు టాప్.. లెక్కలు చెప్పిన మంత్రి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications