పీఆర్సీపై తాడోపేడో-ఏకమైన ఉద్యోగులు-నేడు సచివాలయంలో భేటీ-కేబినెట్ సమయంలోనే
ఏపీలో ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులు ఏకమయ్యారు. ఇప్పటివరకూ నాలుగు ఉద్యోగ జేఏసీలుగా పోరాటాలు చేస్తున్న ఉద్యోగులు.. ఇప్పుడు ఒకే తాటిపైకి రావాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కొత్త వేదికను కూడా ప్రకటించబోతున్నారు ఇవాళ సచివాలయంలో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో కేబినెట్ భేటీ కూడా జరగబోతుండయంతో సచివాలయంలో ఉద్రిక్తత తప్పేలా లేదు.

పీఆర్సీ పోరు తీవ్రం
ఏపీలో పీఆర్సీ పోరు తీవ్రమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసిన జీవోలపై నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్న ఉద్యోగులు.. ఇవాళ దాన్ని పతాకస్ధాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం పీఆర్సీ జీవోలపై వెనక్కి తగ్గేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఉద్యోగులు తమ పోరును ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వారు గ్రామ స్ధాయి నుంచి రాష్ట్ర స్ధాయి వరకూ పోరాటాన్ని ముమ్మరం చేయబోతున్నారు. ఇందుకోసం కార్యాచరణను రాష్ట్రస్ధాయిలో జేఏసీలు ప్రకటించబోతున్నాయి.

ఏకతాటిపైకి ఉద్యోగసంఘాలు
రాష్ట్రంలో ఇప్పటివరకూ నాలుగు ప్రధాన జేఏసీలుగా పనిచేస్తున్న ఉద్యోగసంఘాలు తమ ఉమ్మడి సమస్య అయిన పీఆర్సీపై ఇప్పుడు ఏక తాటిపైకి వచ్చారు. ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ, ఏపీ సచివాలయ సంఘం, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కలిసి పీఆర్సీ పోరాట సమితి పోరుతో ఒకే వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం విజయవాడలోని ఓ హోటల్లో రహస్యంగా సమావేశమైన ఉద్యోగసంఘాల నేతలు.. ఇవాళ సచివాలయంలో మరోసారి సమావేశమై తుది నిర్ణయం ప్రకటిస్తారు.

ఇవాళ సమ్మె నోటీసులు
ఏపీలో ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోల్ని వ్యతిరేకిస్తూ సమ్మెలోకి వెళ్లేందుకు సైతం ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ సీఎస్ కు సమ్మె నోటీసు ఇచ్చేందుకు ఉద్యోగసంఘాలు సిద్దమవుతున్నాయి. సచివాలయంలో జరిగే ఉద్యోగసంఘాల జేఏసీల సమావేశం తర్వాత ఉమ్మడిగా వెళ్లి సీఎస్ సమీర్ శర్మకు సమ్మె నోటీసు ఇచ్చేందుకు ఉద్యోగులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇవాళ నోటీసు ఇచ్చి ఫిబ్రవరి 5 నుంచి సమ్మెకు వెళ్లేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యోగుల సమ్మె వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశమవుతోంది.

కేబినెట్ భేటీ సమయంలోనే
ఇవాళ అమరావతి సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం కాబోతోంది. అదే సమయంలో ఉద్యోగసంఘాల జేఏసీలు అదే సచివాలయంలోని సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ సమావేశంలో నాలుగు జేఏసీలు ఉమ్మడి పోరుకు కార్యాచరణ ప్రకటించబోతున్నాయి. అలాగే ఈ సమావేశం తర్వాత సమ్మె నోటీసు ఇచ్చే అవకాశాలున్నాయి. దీంతో కేబినెట్ సమావేశంలోనూ దీనిపై చర్చ జరగబోతోంది. ఉద్యోగుల పోరుపై కేబినెట్ సమావేశంలోనూ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు. కేబినెట్ భేటీ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సచివాలయంలో ఉద్యోగసంఘాలు భేటీ అవుతున్నట్లు అర్దమవుతోంది. అయితే ప్రభుత్వం వీరి ఒత్తిడికి తలొగ్గుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.
-
స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల సేవల పై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం, తాజా ఆదేశాలు..!! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఏపీ విద్యార్ధులకు సర్కార్ గుడ్ న్యూస్..! దేశంలో తొలిసారి..! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..!











Click it and Unblock the Notifications