ఏపీలో అర్హులందరికీ ఉచిత విద్యుత్.. ఎనీ డౌట్స్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఇచ్చే 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకంపైన ఏపీలో సోషల్ మీడియా వార్ కొనసాగుతుంది. గతంలో వైసిపి హయాంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించామని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని కట్ చేసిందని వైసిపి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్న క్రమంలో ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ప్రకటన చేశారు.
ఆ ప్రచారం నమ్మొద్దు
అర్హులైన ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ ను అందిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన అల్పాదాయ కుటుంబాలకు అందిస్తున్న ఉచిత విద్యుత్ కు సంబంధించి కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు అన్నారు.

ఏపీలో ఉచిత విద్యుత్ లబ్దిదారుల కుటుంబాలు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మొత్తం 15 లక్షల 17298 మంది ఎస్సీ కుటుంబాలు, 4 లక్షల 75, 557 మంది ఎస్టీ కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకంలో లబ్ధిదారులుగా ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు.
కావాలని అసత్యాలు.. నమ్మొద్దు
మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19,92,885 మంది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకంలో లబ్ధిదారులుగా ఉన్నారని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ నెలకు 477. 30 కోట్లు దీనికోసం వినియోగిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు.తక్కువ ఆదాయం ఉన్న వర్గాలకు ఎంతో ఉపయోగంగా ఉన్న ఉచిత విద్యుత్ పథకానికి అడ్డంకులు సృష్టించడానికి కొందరు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మకూడదన్నారు.
కూటమి సంక్షేమ పాలన తట్టుకోలేక వైసీపీ అసత్య ప్రచారం
కూటమి ప్రభుత్వం దళిత గిరిజనుల కోసం అమలు చేస్తున్న పథకాలు అలాగే రాష్ట్రంలో అమలవుతున్న సూపర్ సిక్స్ పథకాలు చూసి తట్టుకోలేకపోతున్న వైసిపి ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేయిస్తుందని మంత్రి గొట్టిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా తాము ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్తు పథకాన్ని అందిస్తున్నామని, దళిత గిరిజనులకు మొదట ఈ ఉచిత పథకాన్ని అందించింది టిడిపి ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు.
అనుమానాలుంటే ఈ నెంబర్ కు కాల్ చెయ్యండి
ఈ పథకం అమలు గురించి విధివిధానాల గురించి ఎవరికైనా ఎలాంటి అనుమానాలు ఉన్న 1912 కాల్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవాలని లేనిపోని అపోహలకు పోకూడదని అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత విద్యుత్ అందిస్తామని స్పష్టం చేశారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications