డబ్బు కోసం.. స్నేహితుడి కొడుకునే కిడ్నాప్ చేసి, భయంతో ఏం చేశారంటే...
అనంతపురం: వాళ్లంతా స్నేహితులు. కానీ వారిలో ఇద్దరి బుద్ధి పెడదారి పట్టింది. డబ్బు కోసం స్నేహితుడి కొడుకునే కిడ్నాప్ చేశారు. తీరా చేశాక భయపడ్డారు. ఏం చేయాలో అర్థం కాక ఆ బాలుడ్ని చంపేసి చెరువులో పడేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
9 ఏళ్ల వయసున్న గౌతమ్ అనే బాలుడిని అతడి తండ్రి స్నేహితులు సాయి, మల్లి అపహరించారు. తాము అడిగినంత డబ్బు ఇస్తేగాని స్నేహితుడి కొడుకును వదలకూడదని భావించారు. అయితే తీరా కిడ్నాప్ చేసి తీసుకొచ్చాక భయపడ్డారు. ఏం చేయాలో అర్థం కాక గౌతమ్ను చంపి, మతదేహాన్ని బి.యాలేరు చెరువులో పడేశారు.

ఎట్టకేలకు పోలీసులు ఈ కేసులో నిందితులైన సాయి, మల్లిలను అరెస్టు చేశారు. మరోవైపు గౌతమ్ హత్యతో అతడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమకు న్యాయం జరిగేలా చూడాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని గౌతమ్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
More From
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications