గంటాశ్రీనివాసరావు పై పత్తిపాటిపుల్లారావుకు పగ: పయ్యావుల కేశవ్
టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య బుదవారం నాడు ఆసక్తికర సంభాషణ చోటుచేసుకొంది.వైఎస్ కుటుంబంపై వారు చర్చించుకొన్నారు.
అమరావతి: టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య బుదవారం నాడు ఆసక్తికర సంభాషణ చోటుచేసుకొంది.వైఎస్ కుటుంబంపై వారు చర్చించుకొన్నారు.వైఎస్ విజయమ్మ, వైఎస్ వివేకానంద రెడ్డిలను ఓడించారని మంత్రి గంటా శ్రీనివాసరావు లక్ష్యంగా ఈ సంబాషణలు చోటుచేసుకొన్నాయి.
బుదవారం నాడు అసెంబ్లీ లాబీల్లో టిడిపి ఎమ్మెల్యేల మధ్య సరదాగా మాట్లాడుకొన్నారు.వైఎస్ కుటుంబంపై మంత్రి గంటా శ్రీనివాస్ రావు పగబట్టారని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సరదాగా వ్యాఖ్యానించారు.
అంతేకాదు గంటా శ్రీనివాస్ రావు ఎక్కువ కాలం మంత్రిగా ఉండడం ఇష్టంలేని మంత్రి పత్తిపాటి పుల్లారావు గంటా పై పగబట్టారని పయ్యావుల కేశవ్ జోక్ చేశారు.

ఈ వ్యాఖ్యలను మంత్రి గంటా శ్రీనివాస్ రావు సరదాగా తీసుకొన్నారు. ఎవరు ఎవరిపై పగబట్టారనేది పయ్యావుల కేశవ్ తేలుస్తారని గంటా వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్నవారంతా నవ్వుకొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడపలో టిడిపి విజయం సాధించిన సందర్భంలో గంటా శ్రీనివాస్ రావును జగన్ పై పోటీకి నిలుపుదామని మంత్రి పత్తిపాటి పుల్లారావు బాబు వద్ద ప్రస్తావించారు.అయితే ఈ నేపథ్యంలో ఈ సంబాషణ సాగింది.కడపలో వైఎస్ విజయమ్మను ఓడించాం, కడపలో వైఎస్ వివేకానందను ఓడించామని గంటా బాబు వద్ద ప్రస్తావించగానే పత్తిపాటి ఈ రకంగా వ్యాఖ్యానించారు.
-
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications