వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తల్లిపైనే అత్యాచారం: చంపించి తల, మొండెం వేరు చేసి...

By Pratap
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: ఓ కామాంధుడు అత్యంత జుగుప్సాకరమైన చర్యకు పాల్పడ్డాడు. తల్లిపైనే కన్నేసి, బెదిరించి, ఆమెపై పలు మార్లు అత్యాచారం చేశాడు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె అతన్ని చంపేసింది. చంపిన తర్వాత తలను, మొండాన్ని వేరు చేయించి, చెరువులో పడేయించింది.

శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఆ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనలో తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కొండవూరు గ్రామానికి చెందిన కోనారి గణపతి(38) తండ్రి వెంకట్రావు 18 ఏళ్ల కిందట మరణించాడు.

అప్పటి నుంచి గణపి తల్లితో కలిసి ఉంటున్నాడు. తిండి పెట్టి, జేబుఖర్చులకు ఇచ్చి, లోటు లేకుండా తల్లిపైనే కన్నేశాడు. ఆమెను కొట్టి, చంపుతానని భయపెట్టి, తరచూ లైంగిక అత్యాచారానికి పాల్పడేవాడు. తల్లి అవమానాన్ని ఎవరికీ చెప్పుకోలేక లోలోనే కుమిలిపోతూ వచ్చిది.

Ganapathy in srikakulam district killed

గణపతి నుంచి తప్పించుకోవడానికి ఇటీవల కూతురు ఇంటికి వెళ్లింది. అక్కడకు కూడా గణపతి వెళ్లేవాడు. సొంత చెల్లెలి ముందే తల్లిని వేధింపులకు గురి చేయసాగాడు. ఈ పరిస్థితుల్లో గేదెల మాధవరావు అనే వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యా డు.

తన కుమారుడి వ్యవహారమంతా ఆయనతో చెప్పుకొని ఆమె బాధపడింది. తన కుమారుడిని చంపడానికి సాయం చేయాలన్న ఆమె కోరింది. అందుకు అతను అంగీకరించాు. గణపతిని ఈ నెల 8వ తేదీన మాధవరావు నమ్మించి బయటకు తీసుకుని వెళ్లాడు.

పలాస-కాశీబుగ్గ సమీపంలోని మీలగారంపాడు గ్రామానికి తీసుకెళ్లాడు. దారిలో చిత్తుగా మద్యం తాగించాడు. పూర్తిగా అపస్మారక స్థితికి చేరుకోగానే కత్తితో పొడిచి గణపతిని చంపేశాడు. తలను, మొండాన్ని వేరు చేసి గోనెసంచిలో చుట్టి, ఓ చెరువులో పడేశాడు.

English summary
Ganapathy, who sexually assaulted his mother in srikakluam district of Andhra Pradesh has been killed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X