కల్లు తాగించి, కోరిక తీర్చలేదని రేప్: ఏడుగురి అరెస్ట్
హైదరాబాద్: కల్లు కాంపౌండ్ వద్ద ఓ మహిళను వెంబడించి, ఆమె పైన సామూహిక అత్యాచారం చేసిన కేసులో ఏడుగురు నిందితులను జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. గురువారం బాలానగర్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ మాట్లాడారు.
ఈ నెల 13వ తేదీన ఓ మహిళ చింతల్లోని కల్లు కాంపౌండ్కు వెళుతుండగా రాజేష్, రుషిపవన్, కిరణ్ వెంబడించి ఆమెతో పాటు కల్లు తాగారు. డబ్బులిస్తామని తమ కోరిక తీర్చాలని పట్టుబట్టడంతో వారి నుండి తప్పించుకొని కుత్బుల్లాపూర్లోని మేనత్త ఇంటికి వెళ్తుండగా.. మరోసారి వారు మరో ఐదుగురు స్నేహితులు రవితేజ, గణేష్, మహబూబ్, మహిబ్రహ్మం, ప్రవీణ్తో కలిసి ఆమెను బలవంతంగా హెచ్ఎంటీ ఖాళీ మైదానంలోకి తీసుకెళ్లి సామూహికంగా అత్యాచారం చేశారు.
ఈ నెల 14వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏడుగురిని గురువారం కోర్టులో హాజరుపరిచారు. ప్రవీణ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం
తొమ్మిదేళ్ల చిన్నారి పైన ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. మోతీదర్వాజాలోని అహ్మద్కాలనీలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు ఫసియుద్దీన్ (27)గా గుర్తించారు. అతడు కిరణా కొట్టు నిర్వహిస్తున్నాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు.
లంగర్హౌజ్ పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడి తండ్రి గోల్కొండ ఠాణాలో ఎస్సైగా పని చేస్తున్నాడు. గురువారం ఉదయం పాల ప్యాకెట్ కోసం దుకాణానికి వచ్చిన 9 సంవత్సరాల బాలికను ఫసియుద్దీన్ లోపలకు తీసుకు వెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.