Yarlagadda Venkatrao : వైసీపీకి యార్లగడ్డ గుడ్ బై-టీడీపీలోకి వెళ్తున్నట్లు ప్రకటన..
గన్నవరం వైసీపీలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాకతో మూడేళ్లుగా కొనసాగుతున్న పోరు ఇవాళ మరో మలుపు తిరిగింది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించినా జగన్ మాత్రం వంశీవైపే మొగ్గు చూపడంతో యార్లగడ్డ ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలు, అనుచరులతో ఇవాళ మరోమారు భేటీ అయిన యార్లగడ్డ తన నిర్ణయం ప్రకటించారు. త్వరలో చంద్రబాబును కలిసి టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు.
ఇవాళ తన అనుచరులతో భేటీ అయిన యార్లగడ్డ వెంకట్రావు వైఎస్సార్ సీపీ శ్రేణులకు క్షమాపణ చెప్పారు. నాయకులు లేని సమయంలో పార్టీ నుంచి పోటీ చేసానని గుర్తుచేసుకున్నారు. అవమానాల కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్లైందన్నారు. గన్నవరం లో వైసీపీ గెలవడమే ద్యేయంగా పనిచేశానని తెలిపారు. టిక్కెట్ ఇవ్వమని మాత్రమే సీఎంను అడిగానన్నారు. పార్టీ పెద్దలకు ఏమి అర్ధమైందో నాకు తెలియలేదన్నారు. రాజశేఖర్ రెడ్డి గారైతే ఇలా ఉండేది కాదని అందరూ చెప్పారని వెంకట్రావు తెలిపారు.

ప్రభుత్వం వచ్చినా తమపై కేసులు కొనసాగాయని యార్లగడ్డ వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. యార్లగడ్డను ఎక్కడైనా సర్దుబాటు చేస్తుందని సజ్జల ప్రకటన చేస్తే బాగుండేదన్నారు. ఉంటే ఉండు....పోతే పొమ్మని సజ్జల చెప్పడం తనకు చాలా బాధ,ఆవేదన కలిగించిందన్నారు. టీడీపీ కంచుకోటలో ఢీ అంటే ఢీ అని పోరాడానని యార్లగడ్డ గుర్తుచేసుకున్నారు. తన కళ్ళు చెమర్చాయని, వేరే పార్టీ నుంచి మన పార్టీలోకి వచ్చిన వారిని కూడా చెత్త అనాలి కదా అన్నారు. నా బలం ఇప్పుడు బలహీనత అయిందా అని సజ్జలను ప్రశ్నించారు. టీడీపీలో గెలిచిన అభ్యర్థిని తెచ్చుకోవడం మీకు బలంగా మారిందా అని అడిగారు.
మూడేళ్ళుగా తనకు ఏ ప్రత్యామ్నాయం చూపించలేదని యార్లగడ్డ వెంకట్రావు ఆరోపించారు. తడిగుడ్డతో గొంతు కోయడం అనేది నా విషయంలో నిజమైందన్నారు. నమ్మిన మనిషిని కాపాడాల్సిన బాధ్యత ఏ పార్టీకైనా ఉంటుందన్నారు. కొంతమంది ఇండిపెండెంట్ అని...కొంతమంది మీ నుర్ణయం అని చెప్తున్నారన్నారు.
ఇంతవరకూ చంద్రబాబు ను లోకేష్ ను,టీడీపీ కలవలేదని, ఎంతమంది కలుద్దామని ప్రయత్నం చేసినా కలవలేదన్నారు. నేను టీడీపీ నేతలను కలిసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానన్నారు. తాను టీడీపీ నేతలను కలిశానని మీరు ఎలా నమ్మారని యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నించారు.తాను వైసీపీకి ద్రోహం చేయలేదని, పార్టీని వాడుకోలేదని యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. త్వరలో చంద్రబాబును కలుస్తానని, తనకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని కోరారు.
-
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications