బాబు సర్కారుపై అలక: గన్మెన్ను సరెండర్ చేసిన ఎమ్మెల్యే వంశీ
గన్నవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సొంత పార్టీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
విజయవాడ: గన్నవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సొంత పార్టీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టు ప్లస్ టు గన్మెన్లు కావాలని ఎమ్మెల్యే వంశీ ప్రభుత్వాన్ని కోరారు. అయితే, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ మంగళవారం తన గన్మెన్ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ.. తన గన్మెన్కు కేవలం ఒక పిస్టల్ మాత్రమే ఇచ్చారని, కనీసం కార్బన్ వెపన్ కూడా ఇవ్వలేదని చెప్పారు.

మూడున్నరేళ్ల నుంచి భద్రతను పెంచమని కోరుతున్నా.. సర్కారు నుంచి స్పందన రాలేదని అన్నారు. అంతేగాక, తన ఆయుధాలు మూడింటిని లైసెన్స్ రెన్యూవల్ కోసం పోలీస్ స్టేషన్లో అప్పగించానని, వాటిని కూడా తిరిగి ఇవ్వలేదని వంశీ వివరించారు.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications