సుప్రీం ఆదేశంపై తెలంగాణకు గంటా, ఉమ్మడి నిబంధనలే
న్యూఢిల్లీ/హైదరాబాద్: విద్యార్థుల భవిష్యత్తు పైన తాము తీసుకున్న నిర్ణయాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సమర్థించిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావు సోమవారం అన్నారు. రాష్ట్ర విభజనతో విద్యార్థులకు సంబంధం లేదని, ఆగస్టు 31వ తేదీన కౌన్సెలింగ్ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో గంటా స్పందించారు.
రాజ్యాంగ నిబంధనలకు లోబడే ఏ ప్రభుత్వాలు అయినా పని చేయాల్సి ఉంటుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తాము తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించిందన్నారు. ఇప్పటికైనా కౌన్సెలింగ్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే స్థానికత

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే స్థానికత ఉంటుందని సుప్రీం కోర్టు పేర్కొందని అడిషనల్ ఏజీ అన్నారు. విభజన చట్టం ప్రకారమే స్థానికత, ఇతర అంశాలలో వెళ్లాలని సుప్రీం చెప్పిందన్నారు. ఉమ్మడి నిబంధనలు పాటించాలని అన్నారు.
ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకే కౌన్సెలింగ్ జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని ఏపీ తరఫు న్యాయవాది తెలిపారు. ఆంధ్రా, తెలంగాణ పదాలే వద్దని చెప్పిందన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే స్థానికతను నిర్ధారించాలని సుప్రీం కోర్టు చెప్పిందన్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications