వైజాగ్ స్టీల్పై గంటా బిగ్ స్కెచ్- రాజీనామా, నాన్ పొలిటికల్ జేఏసీతో వైసీపీకి సవాల్- టార్గెట్ అదే
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయం గత ఎన్నికల తర్వాత నుంచి మౌన వ్రతం చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్కు రాజకీయగా ఊపిరిపోసింది. నిన్న మొన్నటివరకూ వైసీపీ గూటికి చేరాలా లేక బీజేపీ తలుపు తట్టాలా అని ఎదురుచూపులు చూసిన గంటా.. కేంద్ర నిర్ణయంతో ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయారు. ఎవరూ అడగకుండానే రాజీనామా అస్త్రాన్ని సంధించి అధికార వైసీపీకి పెను సవాల్ విసిరారు. ఇప్పుడు నాన్పొలిటికల్ జేఏసీ పేరుతో ఆయన విసురుతున్న మరో సవాల్ కచ్చితంగా వైసీపీని ఇరుకునపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

వేడెక్కుతున్న వైజాగ్ స్టీల్ ఉద్యమం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయం సాగర నగరంలో రాజకీయ వేడి పుట్టిస్తోంది. పార్టీలకు అతీతంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాల్గొనాలనే డిమాండ్లూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా కార్మికసంఘాలు పెంచుతున్న ఒత్తిడి రాజకీయ పార్టీలకు గట్టిగానే తాకుతోంది. దీంతో గతంలో ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ దూరం కాకుండా ఉండేందుకు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్ధితి రాజకీయ నేతలకు ఎదురవుతోంది. రాబోయే రోజుల్లో ఇది మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశముంది.
అదే సమయంలో రాజకీయ పార్టీల వ్యవహారశైలి కూడా ఈ ఉద్యమానికి ఆజ్యం పోస్తోంది.

గంటా కేంద్రంగా మారిపోతున్న ఉద్యమం
విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడం కోసం కార్మికులు మొదలుపెట్టిన ఉద్యమం ఇప్పుడు టీడీపీకి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కేంద్రంగా మారిపోతోంది. స్టీల్ ప్లాంట్ కోసం అందరి కంటే ముందే రాజీనామా సమర్పించిన గంటా శ్రీనివాస్ ఇప్పుడు అక్కడి కార్మికసంఘాలకు, స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులకు ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. దీంతో ఆయన ఆధ్వర్యంలోనే ఉద్యమం సాగాలని వారు కూడా కోరుకుంటున్న పరిస్ధితి. అయితే ఇది గంటా సొంత పార్టీ టీడీపీతో పాటు అధికార వైసీపీకి కూడా చుక్కలు చూపిస్తోంది. అటు గంటాకు నేరుగా మద్దతివ్వలేక, అలాగని వ్యతిరేకించలేక టీడీపీ, వైసీపీ మధనపడుతున్నాయి.

కాక రేపుతున్న గంటా రాజీనామా సవాల్
విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడం కోసం ఉద్యమంలో తొలి రాజీనామా చేసిన గంటా శ్రీనివాస్ వైసీపీకి పెను సవాల్ విసిరారు. తొలుత స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా సమర్పించలేదనే విమర్శలు రావడంతో మరోసారి ఏకవాక్యంతో రాజీనామా లేఖ రాసిన గంటాపై ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక వైసీపీ మధన పడుతోంది. గంటా రాజీనామాను ఆమోదించాలా వద్దా అనేది వైసీపీకి పెద్ద సవాలుగా మారింది. ఈ రాజీనామా ఆమోదిస్తే విశాఖలో తమ పార్టీ నేతల రాజీనామాల డిమాండ్లు పెరుగుతాయి. అలాగని మౌనంగా ఉన్నా రాజీనామాల ఒత్తిడి పెరుగుతూనే ఉంది. దీంతో గంటా రాజీనామా సవాల్ వైసీపీకి తలనొప్పిగా మారింది.

నాన్ పొలిటికల్ జేఏసీ వ్యూహమిదేనా ?
తాను ఓ రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం నాన్-పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేయాలన్న గంటా శ్రీనివాస్ నిర్ణయం సైతం కలకం రేపుతోంది. ముఖ్యంగా రాజకీయ పార్టీల సాయం లేకుండా ఇలాంటి జేఏసీలు నడపడం కూడా సాధ్యం కాదు. అధికారంలో ఉన్న పార్టీలు సహజంగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటాయి. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా టీఆర్ఎస్ ఇలాంటి వ్యూహాలు రచించేది. కానీ ఇప్పుడు విపక్షంలో ఉంటూ గంటా చేస్తున్న ఈ ప్రయత్నం వైసీపీకి అనుకూలమా, ప్రతికూలమా అన్నది తేలాల్సి ఉంది. ఇందులో ఎవరెవరు ఉండబోతున్నారనేది స్పష్టం కాకపోయినా ఇప్పటికే గంటా శ్రీనివాస్ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వంటి వారితో సమావేశాలు నిర్వహిస్తుండటాన్ని బట్టి చూస్తుంటే ఏదో భారీ స్కెచ్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీని టార్గెట్ చేయడంతో పాటు తన సత్తా చూపడమే లక్ష్యంగా గంటా ఈ ప్రయత్నం చే్స్తున్నట్లు సమాచారం.
-
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications