మే 17న డీసెట్... ఇంగ్లీష్ మీడియంలోనూ డీ ఎడ్ కోర్సులు:మంత్రి గంటా
అమరావతి:డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్)లో ప్రవేశం కోసం డీసెట్-2018 ని మే 17న ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. దీనిపై గురువారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి గంటా అనంతరం ప్రకటన విడుదల చేశారు.
ఏప్రిల్ 12 వరకు దరఖాస్తుల స్వీకరణ, మే 28న ఫలితాల విడుదల, జూన్ 4 నుంచి తొలి విడత కౌన్సెలింగ్, జూన్ 25 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అలాగే 2018-19 నుంచి ఆంగ్ల మాధ్యమంలో డీఎడ్ కోర్సులు నిర్వహిస్తామని, అయితే ఇందుకు ఇంటర్ ఇంగ్లీష్ మీడియంలో చదివిన విద్యార్థులే అర్హులని మంత్రి గంటా తెలిపారు.

విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ నెల 25 నుంచి జూన్ 7 వరకు ప్రత్యేక వేసవి శిబిరాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి గంటా తెలిపారు. పౌర గ్రంథాలయ శాఖల ఆధ్వర్యంలో ఉదయం 8 నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు ఈ స్పెషల్ క్యాంప్ ల నిర్వహణ జరుగుతుందని మంత్రి గంటా వెల్లడించారు. ఈ క్యాంపుల్లో పుస్తక పఠనం, కథలు చెప్పడం, సమీక్షలు రాయించడం, చిత్రలేఖనం, సంగీతం, నాటికలు, స్పోకెన్ ఇంగ్లీష్ తదితర అంశాలలో శిక్షణ ఇస్తారని మంత్రి వివరించారు.
More From
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications