గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి: రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు
కృష్ణా: విజయవాడ అంబేద్కర్నగర్లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి ఆ ఇల్లు ధ్వంసమైంది.
గ్యాస్ సిలిండర్ల లారీని ఢీకొన్న మరో లారీ
విశాఖపట్నంలోని లంకెలపాలెం కూడలి వద్ద గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి
తెలంగాణ,
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రాల్లో
జరిగిన
వేర్వేరు
రోడ్డు
ప్రమాదాల్లో
ఆరుగురు
మృతి
చెందారు.
ఏపిలోని
శ్రీకాకుళంలోని
సుభద్రాపురం
జంక్షన్
వద్ద
రోడ్డు
ప్రమాదం
సంభవించింది.
లారీని
ఓ
ఇన్నోవా
వాహనం
ఢీకొనడంతో
ఇద్దరు
వ్యక్తులు
అక్కడికక్కడే
మృతిచెందారు.
మరో
నలుగురు
వ్యక్తులు
గాయపడ్డారు.
గాయపడ్డవారిని
చికిత్స
నిమిత్తం
నిమిత్తం
ఆస్పత్రికి
తరలించారు.
తెలంగాణలోని మెదక్ జిల్లా కొండపాక దగ్గర ఓ మారుతి వ్యాను కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి గోదావరిఖని వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.