పగోలో సజీవదహనం, కర్నూల్లో ఆట కట్టించింది

మిలీషియా సభ్యుల అరెస్ట్
తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలకు సహకరిస్తున్న 13 మంది మిలీషియా సభ్యులను అరెస్టు చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గురువారం తెలిపారు. వారి నుంచి నాటుతుపాకీలు, ల్యాండ్మైన్లు పెట్టేందుకు ఉపయోగించే రెండు డంప్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు.
కల్తీ కల్లు తాగి అస్వస్థత
అనంతపురం జిల్లా లేపాక్షి మండలం చినగానిపల్లెలో కల్తీ కల్లు తాగి పదహారు మంది అస్వస్థత బారిన పడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
యువకుడి దారుణ హత్య
గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెనుమూడి వద్ద యువకుడు దారుణ హత్యగు కురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు యువకుడిని హత్య చేసి తల ఎత్తుకెళ్లారు. రేపల్లె పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
ఆకతాయిల ఆటకట్టించిన యువతి
కర్నూలులో ఓ యువతి ఆకతాయిల ఆట కట్టించింది. కనిపించిన ప్రతిసారి తనను వేధిస్తున్నా భరిస్తూ వస్తున్న ఆ యువతి శుక్రవారం మాత్రం అపర కాళిగా మారారు. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆ యువతిని ఎప్పటిలాగే ఇద్దరు ఆకతాయిలు వేధించడం ప్రారంభించారు.
దీంతో ఒక్కసారిగా ధైర్యం కూడదీసుకున్న ఆ యువతి, ఇద్దరు ఆకతాయిల చెంపను ఛెళ్లుమనిపించింది. అంతటితో ఆగని ఆ యువతి వారిని కదలకుండా పట్టేసి, పోలీసులకు అప్పగించింది. దీంతో పోలీసులు సదరు ఆకతాయిలను పోలీస్ స్టేషన్కు తరలించి వారిపై కేసు నమోదు చేశారు. ఆమె ఆటోలో వెళ్తున్నప్పుడు యువకులు బైక్ పైన ఆమెను ఫాలో అయ్యారు. అప్పుడు వారికి ఆమె బుద్ది చెప్పారు.












Click it and Unblock the Notifications