ప్రేమించి మోసం: పిఎస్ ఎదుట యువతి ధర్నా
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ ఎదుట శ నివారం ఓ యువతి ధర్నాకు దిగింది. ప్రేమించి మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ యువతి డిమాండ్ చేసింది.

ఉత్తరాదికి చెందిన ఓ యువతి తనను ఓ వ్యక్తి ప్రేమించానంటూ మోసం చేశాడంటూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో నిందితుడు ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. తనకు వెంటనే న్యాయం చేయాలని, నిందితుడు తప్పించుకునే అవకాశం ఉందంటూ యువతి పోలీస్స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేస్తామని ఆందోళన విరమించాలని పోలీసులు యువతికి విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications