తిరుమల శ్రీవారికి గ్లోబల్ బ్రాండ్..విదేశాలలో శ్రీవారి ఆలయాలు.. తగ్గేదేలే!
కలియుగ ప్రత్యక్ష దైవం, శేషాద్రి శిఖరాన కొలువైన స్వామి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయితే శ్రీవారి దివ్య వైభవాన్ని ప్రపంచ నలుమూలలకు విస్తరింప చేయాలని టీటీడీ భారీ ప్రణాళికను రూపొందించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచనలతో టిటిడి పాలకమండలి అంతర్జాతీయంగా శ్రీవారి ఖ్యాతిని విస్తరింపజేసే పని మొదలు పెట్టింది.
అంతర్జాతీయంగా శ్రీవారి ఆలయాల విస్తరణ
అంతర్జాతీయంగా శ్రీవారి ఆలయాలను విస్తరించేందుకు, విదేశాలలో ఆలయ నిర్మాణానికి, నిర్వహణకు సంబంధించిన చట్టపరమైన అంశాలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక నిపుణుల కమిటీని నియమించింది. త్వరలోనే పూర్తిస్థాయి కార్యాచరణతో వివిధ దేశాలలో తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. శ్రీవారి ఆలయాల నిర్మాణానికి విదేశాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీగా విన్నపాలు అందుతున్నాయి.

శ్రీవారి ఆలయాలను నిర్వహించడానికి టీటీడీ నమూనాలు
ఇప్పటికే జర్మనీ నుంచి మూడు, యూకే నుంచి 4 ప్రతిపాదనలు రాగా, ఆస్ట్రేలియా , శ్రీలంక, నెదర్లాండ్స్, స్వీడన్, స్విట్జర్లాండ్, పోలాండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్ తో సహా పలు ఇతర దేశాల నుండి కూడా అభ్యర్థనలు వస్తున్నాయి. ఇక ఇదే క్రమంలో విదేశాలలో శ్రీవారి ఆలయాలను నిర్వహించడానికి టీటీడీ మూడు నమూనాలను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
మూడు నమూనాలను సిద్ధం చేసిన టీటీడీ
స్వామి వారి బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినకుండా గ్లోబల్ గా ఏ ప్లాన్ తో ముందుకు వెళితే బాగుంటుంది అన్న దానిపైన టిటిడి పరిశీలన చేస్తోంది. మొదటిది టిటిడి యాజమాన్యంలో భూమి కొనుగోలు నుండి నిర్వహణ వరకు అన్ని చూసుకోవడం. రెండవది స్థానిక హిందూ సంస్థలకు, ఆధ్యాత్మిక, సాంకేతిక సహకారాన్ని అందించి నిర్వహించేలా చూడడం, మూడవది తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక కమిటీల సంయుక్త నిధుల నిర్వహణ.
మొదటి నమూనాలోనే ఆలయాల నిర్మాణాలు
అయితే ఈ మూడింటిలో మొదటి విధానమే మంచిదని, చట్టపరంగా సురక్షితమైనది కూడా అని నిపుణుల కమిటీ అభిప్రాయపడుతోంది. టిటిడి బ్రాండ్ ఇమేజ్, పూజా విధానాల స్వచ్ఛత దృష్ట్యా మొదటి నమూనానే ఉత్తమమైనదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. విదేశాలలో నిర్మించే ఆలయాలలో భారతీయ శిల్పకళ ఉట్టిపడేలా తిరుమల తరహాలోనే ఆగమశాస్త్ర పూజలు జరిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులను భారతదేశం నుంచి ప్రత్యేకంగా శిల్పులను కూడా పంపించనుంది. ఇది సాంప్రదాయ పరిరక్షణకు దోహదం చేస్తుంది అన్న అభిప్రాయం ఉంది.
-
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications