రుషికొండ ప్యాలెస్ ను పిచ్చాసుపత్రిగా మార్చాలి: గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు
గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రుషికొండ ప్యాలెస్ ను మానసిక వైద్యశాలగా మార్చాలని సలహా ఇచ్చారు. ప్రజాధనంతో నిర్మించిన రుషికొండ భవనాన్ని పిచ్చాసుపత్రిగా మార్చాలని సలహా ఇచ్చారు. క్షత్రియ సేవాసమితి ఆధ్వర్యంలో ఇవాళ విశాఖలో ఆయనకు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అశోక్గజపతిరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
విశాఖలో ప్రజాధనంతో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ పెచ్చులు ఊడిపోయాయని తెలిసిందని.. అదే రూ.600 కోట్లు ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయ్యేదని అన్నారు. ఈ భవనాన్ని ఏం చేయాలని ప్రభుత్వం ప్రజలను అడుగుతోందని.. అయితే దానిని పిచ్చి ఆసుపత్రి చేస్తే మంచిదని తన ఉచిత సలహా అని చెప్పుకొచ్చారు. అలా అయితే కనీసం దానిని కట్టిన దుర్మార్గులకి ఆ సముద్ర గాలి తగులుతుంది. ఆ భవనాల ద్వారా ఎలాంటి ఆదాయం రాదు.. అని అశోక్ గజపతిరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనాన్ని ప్రజా హితం కోసమే వాడాలన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు వదిలిన వారికి మనమేం విలువ ఇస్తున్నామో ఆలోచించాలని తెలిపారు.
ఏపీలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన రుషికొండ ప్యాలెస్ పై గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుపయోగంగా ఉన్న ఆ భవనాన్ని మెంటల్ ఆసుపత్రిగా మార్చాలని సలహా ఇచ్చారు. ఈ భవనంలో గోడల పెచ్చులు ఊడిపోయినట్లు తాను విన్నానని ఆయన తెలిపారు. రుషికొండ ప్యాలెస్ ను ఏం చేస్తే బాగుంటుందో ప్రజలే తమ అభిప్రాయాలను చెప్పాలని ఆయన కోరారు. అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

గోవా గవర్నర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అశోక్ గజపతిరాజును విశాఖపట్నంలో క్షత్రియ సేవా సమితి తాజాగా ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనాన్ని ప్రజా హితం కోసమే వినియోగించాలని అన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు వదిలిన వారికి మనమేం విలువ ఇస్తున్నామో ఆలోచించాలని సూచించారు.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications