బొప్పాయిలో గణనాధుడు.. తండోప తండాలుగా తరలివస్తున్న భక్తులు.. విఘ్నాలు తొలగిపోతాయంటూ పూజలు
బొప్పాయి పండులో విఘ్నేశ్వరుడు దర్శనం ఇచ్చారు. బొప్పాయి పండులో గణనాధుడు దర్శనం ఇవ్వడం ఏమిటి అని అనుకుంటున్నారా.. అవును ఇది నిజం.. ఈ వింత తూర్పుగోదావరి జిల్లా యు. కొత్తపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది . గణేశుని రూపంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బుల్లి ఆకృతిలో ప్రత్యక్షమైన బొజ్జగణపయ్యకు పూజలు చేస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా యు .కొత్తపల్లి గ్రామానికి చెందిన బట్టల వ్యాపారి గంగాధర్ తినేందుకు బొప్పాయి కోనుగోలు చేసి షాపుకి తీసుకువెళ్లాడు. బొప్పాయి తినేందుకు కోయగా పండులో బుల్లి ఆకృతితో గణనాథుడు ప్రత్యక్షం అయ్యాడు. దీంతో ఆశ్చర్యపోయిన గంగాధర్ దైవంగా కొలిచి దండం పెట్టారు. వినాయకుడు ఈ విధంగా ప్రత్యక్షమవ్వటం తమ అదృష్టంగా భావిస్తున్నాడు షాప్ యజమాని.
బొప్పాయిలో గణానాధుడు ప్రత్యక్షమవ్వడంతో ఆనందానికి ఆవదుల్లేకుండా పోయాయి. షాపులో ఉన్న దేవుళ్ల చిత్రపటాల వద్ద పెట్టి .. మా విఘ్నాలు తొలిగించు గణనాధా అంటూ పూజలు చేశాడు గంగాధర్. ఈ వార్త ఆనోట ఈ నోటా పాకడంతో షాపుకి తండోప తండాలుగా జనం తరలివచ్చారు. ఈ బొప్పాయి పండులో చెవులు రూపంలో గణనాధుడు ప్రత్యక్షం అవడంతో భక్తుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
గణనాధుడుని పూజించడంతో ఉన్న అడ్డంకులన్నీ తొలుగుతాయని భక్తుల నమ్మకం. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారని హిందువులు విశ్వసిస్తుంటారు. ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్న తొలుత విఘ్నేశ్వరుడికి పూజించి పనులు మొదలు పెట్టడం ఆచారం. రకరకాల అవతారాలలో వినాయకుడిని ప్రతిష్టించి పూజలు చేస్తుంటారు. ఇప్పుడు సాక్షాతు విఘ్నేశ్వరుడి రూపంలో ప్రత్యక్షమై మా షాపుకి వచ్చాడని ఆనందం వ్యక్తం చేశాడు గంగాధర్.
బొప్పాయి పండులో విఘేశ్వరుడు రూపం స్పష్టం కనిపించడంతో అటు భక్తుల ఆనందం రెట్టింపు అవుతోంది. పూజలు చేసిన పాటలు పాడుతున్నారు. మరోవైపు బట్టల పాప్కి భక్తుల పాటు కొనుగోలు దారుల తాకిడి పెరిగింది.. వ్యాపారి గంగాధర్ అదృష్టవంతుడంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సాక్షాత్తు గణనాధుడే ప్రత్యక్షమైయ్యాడంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.