పుట్టలో పుట్టిన అమ్మవారు
తూర్పుగోదావరి : తూర్పుగోదావరి జిల్లాలో నాగుల చవితి రోజున జరిగిన సంఘటన సంచలనం కల్గించింది. పుట్టలో అమ్మవారు పుట్టిందని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీ లో నాగుల చవితి సందర్భంగా స్థానికులు పుట్టను శుభ్రం చేస్తుండగా అమ్మవారి విగ్రహం బయటపడింది. పుట్టలోనే అమ్మవారు పుట్టిందని భక్తులు సంతోషపడ్డారు. నాగుల చవితి రోజునే ఈ ఘటన జరగడంతో పుట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నాగుల చవితిని పురస్కరించుకొని పుట్ట చుట్టూ ఉన్న చెత్తను తొలగిస్తుండగా పుట్టలో నుండి అమ్మవారి విగ్రహం బయటపడింది.పసుపు, కుంకుమతో ప్రత్యేక పజలు నిర్వహించారు.
నాగుల చవితి రోజున పుట్ట నుండి అమ్మవారి విగ్రహం బయటపడడం దేవుడి మహిమగా భక్తులు విశ్వసిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications