మామిడి రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్... రూ.260 కోట్లు రిలీజ్ !
మామిడి రైతులకు ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారు. కొద్దిరోజుల క్రితం కుప్పంలో పర్యటించిన ముఖ్యమంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే మామిడి రైతుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఈరోజు (జూలై 18, 2025) వారి సమస్య పరిష్కారానికి రూ.260 కోట్ల నిధులను విడుదల చేశారు.
అలానే రూ.4 సబ్సిడీతో 6.5 లక్షల టన్నుల తోతాపురి మామిడి కాయలు కొనుగోలు చేసేందుకు కేటాయించాలని ఆదేశించారు. దీంతో మార్కెట్ సమస్యలతో బాధపడుతున్న చిత్తూరు జిల్లా మామిడి రైతులకు లబ్ధిచేకూరనుంది. కాగా సబ్సిడీ మొత్తాన్ని రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నట్లు అధికారులు సూచిస్తున్నారు. రైతులు తమ అకౌంట్లను పరిశీలించుకోవాలని చెప్పారు.

అయితే రూ. 260 కోట్లు MIS విధానంపై పూర్తి సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని వ్యవశాయ శాఖ తెలిపింది. తోతాపురి మామిడి కాయల కొనుగోళ్లు ఆగస్టు 2025 వరకు కొనసాగించాలని, ప్రాసెసర్లు రూ.8, రూ.12 మద్దతు ధర ఇవ్వాలని కోరింది.
మరోవైపు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో సిట్ విచారణ తుది దశకు చేరిందని ఆయన చంద్రబాబు అన్నారు. అన్ని ఆధారాలతో గత పాలకులు అడ్డంగా దొరికారని.. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారని మండిపడ్డారు. దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. జగన్.. తాను చేసిన తప్పుల్ని కూడా మనమీదకు నెట్టేసే రకం అంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రగతిని దేశస్థాయిలో వివరించాల్సిన బాధ్యత ఎంపీలదే'' అని చంద్రబాబు అన్నారు.
-
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా?












Click it and Unblock the Notifications