Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గ్యాస్, పెట్రోల్, డీజిల్ పై ఏపీ వాసులకు సూపర్ న్యూస్.. మీకు దిగులు లేదు!

ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం పశ్చిమ దేశాలలో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే యుద్ధం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ మరియు చమురు కొరతకు దారి తీసింది. ముఖ్యంగా భారతదేశంలో కూడా ఎల్పిజి, చమురు సమస్య ఉత్పన్నమైంది. ఈ పరిస్థితుల నుండి బయటపడటానికి ప్రభుత్వం అనేక ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తోంది.

విశాఖ తీరానికి చమురు, ఎల్పీజీ నౌకలు

ఇరాన్లోని చమురు క్షేత్రాల పైన దాడులు చేయడం, హార్మూజ్ జలసంధి నుంచి నౌకలు రాకపోవడం వంటివి ఈ ప్రధాన సమస్యకు కారణమని తెలుస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరానికి రావలసిన నౌకలు కూడా రాకపోవడంతో ఏపీలో ఆయిల్ మరియు ఎల్పీజీ సమస్య తీవ్రతరమవుతుంది అని, ప్రభుత్వం ప్రత్యామ్నాయాన్ని ఆలోచించాలని భావించిన తరుణంలోనే ఊరట ఇస్తూ విశాఖకు ఎల్పిజి మరియు చమురు నౌకలు చేరుకున్నాయి.

Good News to AP Oil and LPG Ships Arrive at Visakhapatnam Port this month till now 10 ships came

విశాఖకు వచ్చిన, రానున్న ఎల్పీజీ, చమురు నౌకలివే

మార్చి 26వ తేదీన 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో బి డబ్ల్యు బ్రిచ్ నౌక విశాఖ పోర్టుకు చేరుకుంది. అది ఈరోజు అన్లోడ్ అవుతుంది. ఇక ఈనెల 30వ తేదీన నెదర్లాండ్స్ నుంచి హెల్లాస్ గ్లాడియేటర్, అమెరికా రెడ్డి జూపిటర్ నౌకలు రానున్నాయి 'లుపినస్' (22 టీఎంటీ), 'ఏఐ వుకిర్' (26 టీఎంటీ) నౌకలు గత నెల, ఈ నెలలో యూఏఈ, ఖతార్‌ల నుండి ఇప్పటికే వచ్చాయి.

ఈ వారంలో మరిన్ని నౌకల రాక

ఇదిలా ఉంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్‌)కు చెందిన 'ఎంవీ సమర్ శృతి' నౌక ప్రస్తుతం విశాఖ పోర్టులో 65 వేల టన్నుల డీజిల్‌ను అన్‌లోడ్ చేస్తోంది. 'ఎంవీ స్వర్ణ సింధు' క్రూడ్ ఆయిల్ నౌక మరో రెండు రోజుల్లో రానుంది. ఇక రష్యా నుంచి 1,36,728 టన్నుల ముడి చమురుతో జంబో నౌక శుక్రవారం విశాఖకు చేరుకోనుంది.

ఈ నెలలో ఇప్పటికి పది చమురు నౌకలు విశాఖకు

వచ్చేనెల 2, 5 తేదీల్లో 'ఫౌండేయ' (రష్యా నుంచి), 'దేశ్ గౌరవ్' (ముంద్రా పోర్టు) నౌకలు ముడి చమురుతో రావలసి ఉంది. ఈనెల 1 నుంచి 25 మధ్య ఇరాక్, రష్యా, ఖతార్, యూఏఈ, భారత దేశంలోని పలు పోర్టుల నుంచి పది చమురు నౌకలు విశాఖకు చేరినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు చమురు నౌకలు ఒకటొకటిగా చేరుకుంటూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాక ఇతర పోర్టుల్లోనూ రద్దీ ఉంది.

నంద్యాలలో కిల్లర్ వైఫ్.. ప్రియుడిమోజులో భర్తను అలా..
నంద్యాలలో కిల్లర్ వైఫ్.. ప్రియుడిమోజులో భర్తను అలా..

మంగళూరు, చెన్నై పోర్ట్ లకు నౌకలు

40 వేల టన్నుల ఎల్‌పీజీతో 'అపోలో ఓషియన్‌' గురువారం న్యూ మంగళూరుకు చేరుకుంది. రష్యా నుంచి లక్ష టన్నుల ముడి చమురుతో మూడో నౌక చెన్నై హార్బర్‌కు గురువారం వచ్చి చేరింది. మరొకటి శనివారం వస్తుంది. న్యూ మంగళూరుకు మరో రెండు ముడి చమురు నౌకలు త్వరలో రానున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+