సీఎం జగన్ కు కలిసిరాని 3 అంకె.. మాడు పగిలేందుకేనన్న టీడీపీ.. డీజీపీకి చంద్రబాబు లేఖ..
ఇటీవలే ఏడాది పాలన పూర్తి చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాల వ్యాప్తిని మరింత వేగవంతం చేశారు. కానీ విధాన నిర్ణయాలు, ఇంకొన్ని కీలక మార్పుల విషయంలో మాత్రం వివిధ రూపాల్లో తీవ్రమైన ప్రతికూలత ఎదుర్కొంటున్నారు. పంచాయితీ భవనాలకు రంగుల దగ్గర్నుంచి రాజధాని మార్పు దాకా పలు అంశాల్లో జగన్ సర్కారుకు ఎదురుదెబ్బలు తగిలాయి. దీన్ని అంకెతో ముడిపెడుతూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. తమ నేతల భద్రత విషయంలో చంద్రబాబు, నారా లోకేశ్ సైతం సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫిర్యాదు కోసం స్టేషన్కు తల్లీకూతుళ్లు.. వాళ్లను చూస్తూ ఎస్ఐ హస్తప్రయోగం.. రూ.25వేల రివార్డు..
మూడుతో మాడు పగులు..
జగన్ అధికారంలోకి వస్తూనే పంచాయితీ భవనాలకు మూడు రంగులు వేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కరోనా వ్యాప్తి కట్టడి కోసం ప్రతి మనిషికి మూడేసి మాస్కులు అందిస్తామని చెప్పడం తెలిసిందే. ఈ మూడు అంశాల్లోనూ వైసీపీ సర్కారు దారుణంగా ఫెయిలైందని, చూడబోతే మూడుతో మాడు పగిలినట్లుందని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు.
గాల్వాన్లో చైనాకు భారీ షాక్.. కృత్రిమ నిర్మాణాలపై ప్రకృతి ప్రకోపం.. చర్చల్లో అసాధారణ ప్రతిపాదన..
చివరికి మిగిలిందిదే..
‘‘మూడు మాస్కులు అన్నారు.. కానీ క్వాలిటీ లేకపోయే. మూడు రాజధానులు అన్నారు.. దానిపై ఇంకా క్లారిటీ లేకపోయే. బిల్డింగ్ లకు మూడు రంగులు అన్నారు.. చివరికి ఒక రంగు మాత్రమే మిగిలింది. మొత్తానికి ఈ మూడు అంకె ఉన్నది వైసీపీ ప్రభుత్వానికి మాడు పగిలేందుకే అనుకుంటా'' అని బుచ్చయ్య ఘాటు సెటైర్ వేశారు. బుధవారం కడియం మండల పరిషత్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలని సూచించారు. ఇదిలా ఉంటే..
వర్ల భద్రతపై బాబు ఆందోళన..
టీడీసీ నేత వర్ల రామయ్యకు వన్ ప్లస్ వన్ భద్రత తొలగిస్తూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షనేత చంద్రబాబు తప్పుపట్టారు. అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే టీడీపీ నేతలపై సర్కారు కక్షకట్టిందని ఆరోపించారు. రామయ్యకు వెంటనే సెక్యూరిటీ పునరుద్ధరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్కు బుధవారం లేఖ రాశారు. వర్ల మాజీ ఐపీఎస్ కావడంతో గత ప్రభుత్వాలన్నీ వన్ ప్లస్ వన్ భద్రత కొనసాగించాయని, ప్రస్తుత సర్కారు అందుకు విరుద్ధంగా వెళుతుండటం సరికాదని బాబు లేఖలో పేర్కొన్నారు.
మూల్యం తప్పదు..
వర్ల రామయ్య భద్రతపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేయగా, టీడీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడి ఆరోగ్యంపై నారా లోకేశ్ స్పందించారు. ఈఎస్ఐ స్కామ్ కేసుల అరెస్టయిన అచ్చెన్న బుధవారం విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో ఆయనను విజయవాడ జైలుకు తరలించారు. పైల్స్ ఆపరేష్ చేయించుకున్న అచ్చెన్న పట్ల సీఎం జగన్ సైకోలా వ్యవహరిస్తున్నారని, అన్నింటికీ మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేశ్ హెచ్చరించారు.
Recommended Video
బలవంతపు డిశ్చార్జ్..
అన్ని పరీక్షలు నిర్వహించకముందే తనను డిశ్చార్జ్ చేయడమేంటని ప్రశ్నిస్తూ.. జీజీహెచ్ సూపరింటెండెంట్ కు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఇదే విషయాన్ని నారా లోకేశ్ ప్రస్తావిస్తూ.. ‘‘ అచ్చెన్నన్ను బలవంతంగా డిశ్చార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. సీఎం జగన్ సైకోలా వ్యవహరిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఆపరేషన్ అయిన వ్యక్తిని 24 గంటలు రోడ్ల పై తిప్పి రెండోసారి ఆపరేషన్ కి కారణం అయ్యారు. ఇప్పుడు గాయం మానక ముందే డాక్టర్ల పై ఒత్తిడి చేసి డిశ్చార్జ్ చేసారు. చేస్తున్న ప్రతీ తప్పుకి జగన్ రెడ్డి గారు మూల్యం చెల్లించుకోక తప్పదు'' అని లోకేశ్ వ్యాఖ్యానించారు.