ఓటుకు నోటు కేసు: మీరే చక్కదిద్దాలంటూ గవర్నర్కు రాజ్నాథ్...?
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్ నరహింహాన్, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ని బుధవారం సాయంత్రం కలిసి ఒక నివేదికను సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, గవర్నర్కు కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్ధితులు కేంద్రం వరకూ రాకుండా హైదరాబాద్లోనే చక్కదిద్దాలని గవర్నర్కు స్పష్టం చేసినట్లు సమాచారం. ఓటుకు నోటు వ్యవహారంలో తన బాధ్యత లేదని, ఏసీబీ తన పరిధిలోనే పని చేసిందని గవర్నర్ నరసింహన్ హోంమంత్రికి వివరించినట్లు తెలిసింది.
గత ఏడాదిగా శాంతి భద్రతల పరిస్థితి సజావుగా ఉందని, అందువల్ల తన అధికారాలను ఉపయోగించాల్సిన అవసరం రాలేదని ఆయన చెప్పారని తెలుస్తోంది. ముందుగా రాజ్నాథ్తో చంద్రబాబు సమావేశం కావాల్సి ఉన్నప్పటికీ, ఆలస్యం అవడంతో గవర్నర్తో సమావేశమయ్యారు.

ఓటుకు నోటు వ్యవహారం గురించి గవర్నర్ మాట్లడుతుండగా మధ్యలోనే ఏపీ సీఎం చంద్రబాబు రాజ్నాథ్ ఆఫీసుకి రావడంతో గవర్నర్తో భేటీని అర్థాంతరంగా ముగించి, బాబుతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడి వెళ్లిన తర్వాత మళ్లీ గవర్నర్ వచ్చారు.
రెండోసారి రాజ్నాథ్ ‘మిగతా వివరాలను, మీ అభిప్రాయాలను హోం సెక్రటరీకి వివరించండి' అని చెప్పినట్లు సమాచారం. రాజ్నాథ్తో సమావేశం అనంతరం గవర్నర్ నరసింహాన్ మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు, సమస్యలు పరిష్కారం కావాలని ఆశిస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు.
‘‘ఫోన్ ట్యాపింగ్పై, రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతలపై నేను ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. విభజనకు ఏడాది పూర్తయిన నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలపై వివరించేందుకే వచ్చాను'' అన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి రాజధానిలో గవర్నర్ అధికారాలు, సెక్షన్ 8పై హోంశాఖ కార్యదర్శి గోయల్ మీ వైఖరి తెలుసుకున్నారా? అన్న ప్రశ్నకు ఈ అంశంపై చర్చించ లేదని చెప్పారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications