ఆ మూడు రకాల సేవలు...రూ.149కే...అథ్బుతం...గవర్నర్ ప్రశంసలు
అమరావతి: గవర్నర్ నరసింహన్ చంద్రబాబు, లోకేష్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అసాధ్యం లాంటి ఫైబర్గ్రిడ్ ను సుసాధ్యం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్కు గవర్నర్ అభినందనలు తెలిపారు.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా బుధవారం ఫైబర్ గ్రిడ్ను ప్రారంభించారు. అనంతరం గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ రూ.149తో మూడు రకాల సేవలు అందించడం అద్భుతమని కొనియాడారు. ప్రస్తుతం ఆలోచనలే సంపదగా మారాయని, పట్టణాలు, గ్రామాల మధ్య అంతరాలు తొలగిపోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సుస్థిర అభివృద్ధే తారకమంత్రం కావాలని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు.













Click it and Unblock the Notifications