మంత్రి కిడారి శ్రావణ్తో రాజీనామా చేయించండి: సీఎంకు గవర్నర్ అదేశం : కారణం అదేనా..!
Recommended Video
ఏపీ కేబినెట్లో ఒక మంత్రిని రాజీనామా చేయించాలని నేరుగా గవర్నర్ నరసింహన్..ముఖ్యమంత్రిని ఆదేశించారు. వైద్య..గిరిజన సంక్షేమ శాఖా మంత్రిగా ఉన్న కిడారి శ్రావణ్తో రాజీనామా చేయించాలని గవర్నర్ ఆదేశంగా రాజ్భవన్ నుండి ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందింది. మరి కొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు వస్తున్న వేళ.. ఏపీ కేబినెట్ భేటీ కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో గవర్నర్ ఆదేశం ఇప్పుడు ప్రభుత్వంలో హాట్ టాపిక్గా మారింది.
మంత్రి
శ్రావణ్తో
రాజీనామా
చేయించండి...
2014
ఎన్నికల్లో
అరకు
నుండి
ఎమ్మెల్యేగా
గెలిచిన
కిడారి
సర్వేశ్వరరావు
ఆ
తరువాత
టీడీపీలో
చేరారు.
ఆయనకు
విప్
పదవి
లభించింది.
గత
ఏడాది
ఆయనను
మావోయిస్టులు
కాల్చి
చంపారు.
ఆ
సమయంలో
విదేశీ
పర్యటనలో
ఉన్న
ముఖ్యమంత్రి
చంద్రబాబు
స్వదేశానికి
తిరిగి
రాగానే
సర్వేశ్వర
రావు
కుమారుడి
బాధ్యత
తాను
తీసుకుంటానని
హామీ
ఇచ్చారు.
ఈ
మేరకు
గత
నవంబర్
11న
జరిగిన
మంత్రి
వర్గ
విస్తరణలో
ఆయనకు
అవకాశం
కల్పించారు.
కీలకమైన వైద్య..గిరిజన సంక్షేమ శాఖలు అప్పగించారు. అయితే, ఆయనకు ఆ తరువాత ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని భావించినా.. అలా చేయలేదు. గత నెల 11న ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అరకు నుండి టీడీపీ అభ్యర్దిగా బరిలో ఉన్నారు. ఇంకా ఫలితాలు రాలేదు. ఇదే సమయంలో ఆయనను మంత్రి పదవికి రాజీనామా చేయమని కోరాలని గవర్నర్ నరసింహన్ ఏకంగా ముఖ్యమంత్రికి సూచించారు.
కేవీపీని వెనకేసుకొచ్చిన ఉండవల్లి .. పోలవరంపై అనుమానాలు నివృత్తి చేస్తే బహిరంగ క్షమాపణ చెప్తా
సమయం
పూర్తయింది...
ఎవరైనా
మంత్రివర్గంలో
ప్రమాణ
స్వీకారం
చేసిన
తరువాత
ఎమ్మెల్యే
లేదా
ఎమ్మెల్సీగా
సభ్యత్వం
పొందాలి
.
అయితే,
గత
ఏడాది
నవంబర్
11న
శ్రావణ్
మంత్రిగా
బాధ్యతలు
స్వీకరించారు.
ఈనెల
10వ
తేదీతో
ఆయనకు
ఆరు
నెలల
సమయం
పూర్తువుతుంది.
ఈ
సమయంలోనే
ఆయన
చట్ట
సభల్లో
సభ్యుడిగా
అర్హత
సాధించ్
పోతే
ఆటోమేటిక్గా
మంత్రి
పదవి
కోల్పోతారు.
ఎన్నికల
ఫలితాలు
ఈ
నెల
23న
వెల్లడి
కానున్నాయి.
ఫలితాల్లో
శ్రావణ్
విజయం
సాధించినా..వచ్చే
సభలో
సభ్యుడిగా
ఉంటారు.
ఈ
నెల
10వ
తేదీకి
మంత్రి
పదవి
కోల్పోవాల్సి
ఉంటుంది.
దీంతో..ముందుగానే
శ్రావణ్
ద్వారా
మంత్రి
పదవికి
రాజీనామా
చేయించాలని
గవర్నర్
నేరుగా
ముఖ్యమంత్రి
కార్యాలయానికి
సమాచారం
అందించారు.
రాజ్యంగం
ప్రకారం
నిబంధనలు
పాటించాల్సి
ఉండటంతో
మంత్రి
పదవికి
శ్రావణ్
రాజీనామా
చేయక
తప్పని
పరిస్థితి
ఏర్పడుతోంది.