కాళ్ళు పట్టుకోలేం... విజయసాయి రాజీనామాపై గుడివాడ అమర్నాథ్ షాకింగ్ కామెంట్స్
వైసిపి కీలక నేత రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకొని వ్యవసాయం చేసుకుంటానని పేర్కొన్న విజయసాయిరెడ్డి తాజా నిర్ణయం పైన ఇప్పటికే వైసీపీ స్పందించిన విషయం తెలిసిందే.
విజయసాయి రాజీనామాపై వైసీపీ స్పందన ఇలా
విజయ సాయి రెడ్డి నిర్ణయాన్ని ఆమోదించకపోయినా, ఆయన ఎంపికను ఎప్పటికీ గౌరవిస్తామని పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి బలమైన మూల స్తంభాలలో ఒకరిగా విజయ సాయి రెడ్డి ఉన్నారని వైసిపి పేర్కొంది. విజయ సాయి రెడ్డి నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని, మీ సహాయ సహకారాలు ఎప్పుడు గుర్తుండిపోతాయని వైసిపి విజయ సాయి రెడ్డి రాజీనామా పైన ట్వీట్ చేసింది.

కాళ్ళు పట్టుకోలేం అంటూ ఘాటు వ్యాఖ్యలు
తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజీనామా పైన ఘాటుగా స్పందించారు. నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖలోని పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించిన అనంతరం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీ మారే వాళ్ళని సముదాయిస్తాం కానీ కాళ్లు మాత్రం పట్టుకోలేమని గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు చేశారు .
నాయకుడు పోతే నాయకులను తయారు చేసుకోవటం జగన్ కు తెలుసు
ఆయన తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని స్వయంగా చెప్పారని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ఒక నాయకుడు వెళ్లిపోతే మళ్ళీ నాయకులను ఏ విధంగా తయారు చేసుకోవాలో జగన్మోహన్ రెడ్డికి తెలుసని ఆయన అన్నారు. ఎక్కడైనా నాయకుల మీద ఒత్తిడి ఉండడం సహజమేనని దానిని కొంతమంది తట్టుకుంటే మరి కొంతమంది తట్టుకోలేరని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఒక్క మనిషి పోతే రాజకీయాలేం ఆగవు
ఇక వైయస్ జగన్ విదేశాల నుంచి వచ్చిన తర్వాత తాజా పరిణామాల మీద చర్చిస్తామని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఇదే సమయంలో గతంలో సీఎం చంద్రబాబు మీద నమ్మకం లేక రాజ్యసభ సభ్యులు పార్టీలే మారారని గుర్తు చేశారు. చంద్రబాబు దావోస్ వెళ్లి ఉత్తి చేతులతో తిరిగి వచ్చారని ఎద్దేవా చేశారు. ఒక మనిషి లేకపోయినంత మాత్రాన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఆగబోదని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications