శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లాలని వార్నింగ్, అక్రమ సంబంధమే కారణమా?
హైదరాబాద్/గుంటూరు: గుంటూరు జిల్లాకు చెందిన చంటి అనే వ్యక్తి హైదరాబాదులో దారుణ హత్యకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు శవాన్ని తీసుకు వెళ్లేందుకు వచ్చారు.
అయితే గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని తీసుకు వెళ్లాలని హత్య చేసిన వారు కుటుంబ సభ్యులకు హెచ్చరికలు జారీ చేశారని వార్తలు వస్తున్నాయి.
కాగా, గత కొన్నాళ్లుగా చంటి హైదరాబాదులో ఉంటున్నాడు. చంటి హత్యకు అక్రమ సంబంధం కారణమని అనుమానిస్తున్నారు. రోడ్డుపై అతను అనుమానాస్పదస్థితిలో మృతి చెంది ఉండగా, ముక్కు, నోరుపై పిడిగుద్దులు ఉండటంతో హత్యగా భావించారు.
English summary
Guntur man killed in Hyderabad.
Story first published: Tuesday, October 10, 2017, 17:03 [IST]