ఐటీ రైడ్స్ ఇంకా జరగాలి: బాబుకు జీవీఎల్ షాక్, 'జగన్-విజయసాయి విదేశాలకు పారిపోయే యత్నం'
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నేతలు అవినీతితో సంపాదించిన సొమ్ము రెండేళ్ల రాష్ట్ర బడ్జెట్తో సమానమని బీజేపీ నాయకులు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు మంగళవారం సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడారు.

ఏపీలో ఐటీ దాడులు ఇంకా జరగాల్సి ఉంది
అవినీతి సొమ్మును అధికార పార్టీ నేతలు పలు కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టారని జీవీఎల్ విమర్శించారు. అవినీతిపరుల బినామీ కంపెనీల పైనే ఐటీ దాడులు జరిగాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఆదాయపన్ను శాఖ తనిఖీలు ఇంకా జరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

టీడీపీ నేతలకు భయమెందుకు?
ఐటీ దాడులు జరిగిన కంపెనీల్లో అధికార పార్టీ నేతలు బోర్డు సభ్యులుగా లేనప్పుడు వారికి భయం ఎందుకో చెప్పాలని జీవీఎల్ నర్సంహా రావు నిలదీశారు. అవినీతి సొమ్ముతో నాయకులు ఫైవ్ స్టార్ హోటళ్లను మించిన భవనాలు కడుతున్నారని ధ్వజమెత్తారు.

ఏపీకి ఒక్క రూపాయి ఇవ్వలేదు
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే తెలంగాణకు కేంద్రం రూ.450 కోట్లు ఇచ్చిందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రబాబు అన్నారు. అందుకే వెనుకబడిన జిల్లాలకు ఈ డబ్బులు ఇచ్చారని చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్కు ఒక్క రూపాయి ఇవ్వలేదని చెప్పారు.

జగన్, విజయసాయి విదేశాలకు పారిపోయే ప్రయత్నం
ఎన్నికలు పూర్తి కాగానే జగన్, విజయసాయి రెడ్డి సహా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని కనకమేడల అన్నారు. సోమవారం విజయసాయి రెడ్డి ఇవే వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు, లోకేష్ విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని విజయసాయి అన్నారు. దానికి రవీంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే విజయసాయి రెడ్డి జార్జియా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని రవీంద్రబాబు అన్నారు.
-
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications