విద్యార్థులకు సిఎంరమేష్ సంఘీభావం, హరికృష్ణ ఖండన
ఈ సమయంలో సిఎం రమేష్ వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విభజన ద్వారా ఉభయ ప్రాంతాలకు న్యాయం చేస్తేనే తాము ఒప్పుకుంటామని చెప్పారు. ఏ ప్రాంతానికి న్యాయం జరగకున్నా తాము విభజనకు వ్యతిరేకమే అన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని ముందు వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెసు వారిని బుజ్జగించేందుకే ఆంటోని కమిటీని వేశారని ధ్వజమెత్తారు. తెలంగాణను కేబినెట్కు టేబిల్ ఐటంగా తీసుకు రావడం ఏమిటని ప్రశ్నించారు. మంత్రులకు ముందే ఇస్తే చదువుకుంటారని, వ్యతిరేకిస్తారని దొంగచాటుగా టేబుల్ ఐటెంగా తీసుకు వచ్చారన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలతో లాలూచీపడి సీమాంధ్రకు న్యాయం చేయకుండా విభజన చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాగా, సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రధాని నివాసం వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ ఖండించారు.