హరికృష్ణ యాక్టివ్: వనజాక్షికి అండ, రిషికేశ్వరి ఇష్యుపై ఫైర్
హైదరాబాద్: కృష్ణా జిల్లవా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షికి తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూర్ సభ్యుడు, సినీ నటుడు నందమూరి హరికృష్ణ మద్దతుగా నిలిచారు. ఆమెకు బెదిరింపు లేఖ రావడాన్ని ఆయన మంగళవారంనాడు ఖండించారు. వనజాక్షికి అండగా ఉంటామని ఆయన ప్రకటించారు. వనజాక్షికి బెదిరింపు లేఖ రాసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అదే విధంగా నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థిని రిషికేశ్వరి మరణానికి కారణమైనవారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వారు ఎంతటివారైనా సరే వదిలిపెట్టకూడదని ఆయన అన్నారు. సీనియర్ల ర్యాగింగ్ కారణంగా రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

కాగా, గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న హరికృష్ణ మళ్లీ చురుకైన పాత్ర పోషించే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.
ఇప్పుడు వనజాక్షి ఉదంతంపై, రిషికేశ్వరి ఆత్మహత్యపై స్పందించడాన్ని బట్టి కూడా ఆయన రాజకీయాల్లో తిరిగి చురుగ్గా ఉండేందుకు నిర్ణయించుకున్నారని అంటున్నారు.
-
చరిత్ర సృష్టించిన ఏపీ జెన్ కో.. 6160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో.. -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications