వివాదాస్పద వ్యక్తి, మంత్రి పదవి ఇవ్వలేదనే: జోగయ్యపై కళా, మోడీపై జైరాం
గుంటూరు: వంగవీటి మోహన్ రంగా హత్య కేసులో చంద్రబాబు నాయుడు హస్తం ఉందన్న హరిరామ జోగయ్య వ్యాఖ్యల పైన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు బుధవారం నాడు మండిపడ్డారు. కాపులకు తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.
హరిరామ జోగయ్య అవాకులు, చెవాకులు పేలకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆయన పైన క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. రంగా హత్యకు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. హరిరామ జోగయ్య ఓ వివాదాస్పద వ్యక్తి అన్నారు.
అనుచిత వ్యాఖ్యలు చేసి పుస్తకాలను సొమ్ము చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే కాపులకు సరైన ప్రాధాన్యం లభిస్తుందన్నారు. టిడిపి హయాంలో ఆయనకు మంత్రిపదవి ఇవ్వలేదని ఇష్టారీతిగా ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ప్రత్యేక హోదా హామీని మోడీ విస్మరిస్తున్నారు: జైరాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీని ప్రధాని నరేంద్ర మోడీ విస్మరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. ఏపీ కాంగ్రెస్ నేతలు నిర్వహించబోయే మట్టి సత్యాగ్రాహానికి ఆశీస్సులు అన్నారు.
ఢిల్లీలో రాజ్ ఘాట్ వద్ద మహాత్ముడికి కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, రఘువీరా రెడ్డి, కేవీపీ రామచంద్రరావులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జైరాం మాట్లాడారు. చట్టంలో లేకపోయినా ఉత్తరాఖండ్కు హోదా ఇచ్చారన్నారు.
ఉప్పు సత్యాగ్రహం స్పూర్తితో మట్టి సత్యాగ్రహం నిర్వహించ తలపెట్టామని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా అన్నారు. ప్రత్యేకహోదా, విభజన చట్టంలో హామీలను సాధించేందుకు ఈ మట్టి సత్యాగ్రహం చేపడుతున్నట్టు చెప్పారు. ఈ నెల 6న నిర్వహించనున్న విస్తృత స్థాయి సమావేశంలో విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications