పవన్ సమక్షంలో జనసేనలోకి హరిరామజోగయ్య కుమారుడు
పశ్చిమగోదావరి: సీనియర్ రాజకీయ నేత చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. జనసేన భావజాలానికి ఆకర్షితుడై జనసేన పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు.

జనసేన పోరాట యాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించిన పవన్.. ఆ తర్వాత భీమవరం తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యలో పాలకొల్లు పట్టణంలో సీనియర్ రాజకీయ నేత హరిరామజోగయ్యను వారి నివాసంలో కలుసుకున్నారు.

సుమారు గంటపాటు సమకాలీన రాజకీయాలపై వీరిద్దరు చర్చించారు. పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటాన్ని హరిరామజోగయ్య మెచ్చుకున్నారు. అంతేగాక, ఆయన రచించిన 60వసంతాల నా రాజకీయ ప్రస్తానం అనే పుస్తకాన్ని పవన్కు బహూకరించారు. ఈ సందర్భంగానే సూర్యప్రకాశ్ జనసేనలో చేరారు.
More From
-
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
ఉస్తాద్కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications