పవన్ సమక్షంలో జనసేనలోకి హరిరామజోగయ్య కుమారుడు
పశ్చిమగోదావరి: సీనియర్ రాజకీయ నేత చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. జనసేన భావజాలానికి ఆకర్షితుడై జనసేన పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు.

జనసేన పోరాట యాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించిన పవన్.. ఆ తర్వాత భీమవరం తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యలో పాలకొల్లు పట్టణంలో సీనియర్ రాజకీయ నేత హరిరామజోగయ్యను వారి నివాసంలో కలుసుకున్నారు.

సుమారు గంటపాటు సమకాలీన రాజకీయాలపై వీరిద్దరు చర్చించారు. పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటాన్ని హరిరామజోగయ్య మెచ్చుకున్నారు. అంతేగాక, ఆయన రచించిన 60వసంతాల నా రాజకీయ ప్రస్తానం అనే పుస్తకాన్ని పవన్కు బహూకరించారు. ఈ సందర్భంగానే సూర్యప్రకాశ్ జనసేనలో చేరారు.
More From
-
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications