సీబీఐ విచారణ కోసం ఏపీ హైకోర్టుకు: దళిత యువకుడి మృతిపై డౌట్స్: కాంగ్రెస్ మాజీ ఎంపీ పిటీషన్
అమరావతి: ప్రకాశం జిల్లా చీరాలలో దళిత యువకుడు కిరణ్ కుమార్ మృతి చెందిన ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మాజీ లోక్సభ సభ్యుడు జీవీ హర్షకుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఉదయం ఆయన హైకోర్టులో పిటీషన్ను దాఖలు చేశారు. హైకోర్టు ఈ పిటీషన్ను విచారణకు స్వీకరించింది. ప్రభుత్వం తన వాదనను వినిపించడానికి రెండు వారాల గడువు ఇచ్చింది. ఈ కేసును రెండు వారాల పాటు వాయిదా వేసింది.
చీరాలలోని థామస్ పేటకు చెందిన కిరణ్ కుమార్ జులైలో మరణించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ కుమార్, ఆయన స్నేహితుడు షైనాయ్ను మాస్కు లేకుండా తిరుగుతున్నారనే కారణంతో వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేసు నమోదు చేశారు చీరాల పోలీసులు. తమను అదుపులోకి తీసుకున్న సందర్భంగా పోలీసులు తీవ్రంగా కొట్టారంటూ కిరణ్ కుమార్, ఆయన స్నేహితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ మరుసటి రోజే కిరణ్ కుమార్ మరణించారు. తీవ్రంగా గాయపడిన కిరణ్ కుమార్ను గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు.

పోలీసులు కొట్టిన దెబ్బల వల్లే కిరణ్ కుమార్ మరణించారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు చెలరేగాయి. తాజాగా- కిరణ్ కుమార్ మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని, ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ జీవీ హర్షకుమార్ హైకోర్టును ఆవ్రయించారు. హర్షకుమార్ తరఫున ప్రముఖ న్యాయవాది శ్రావణ్ కుమార్ ఈ పిటీషన్ను దాఖలు చేశారు. విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
సీబీఐ దర్యాప్తునకు అప్పగించడానికి అవసరమైన అన్ని అర్హతలు ఈ కేసుకు ఉన్నాయని న్యాయమూర్తులు వ్యాఖ్యానించినట్లు సమాచారం. కిరణ్ కుమార్ మరణంపై పోలీసులు నిర్వహించిన విచారణ పట్ల ఆయన కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారని, ఈ పిటీషన్ దాఖలు చేయడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయంటూ ప్రభుత్వం తరఫు న్యాయవాది వినిపించిన వాదనలతో న్యాయమూర్తులు ఏకీభవించలేదు. ప్రభుత్వం తరఫున వాదనలను వినిపించడానికి రెండు వారాల పాటు గడువు ఇచ్చింది. అనంతరం ఈ కేసుపై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Recommended Video
-
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య..












Click it and Unblock the Notifications