శోభానాగిరెడ్డి పేరు తొలగింపుకి నో: కోర్టు తీర్పు ప్రకారమే
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి పేరును బ్యాలెట్ పేపర్ నుండి తొలగించేందుకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నిరాకరించింది. ఆళ్లగడ్డ ఎన్నికల ఫళితాలు కోర్టు వెలువరించే తుది తర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.
ఇందుకు సంబంధించి హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎ శంకరనారాయణతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. బ్యాలెట్ పేపర్ నుండి శోభా నాగిరెడ్డి పేరును తొలగించాలని కర్నూలు జిల్లాకు చెందిన హర్షవర్ధన్ రెడ్డి, వినోద్ కుమార్ రెడ్డిలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి... ఈవిఎంల నుండి శోభా నాగిరెడ్డి పేరు తొలగించేందుకు నిరాకరించింది. అయితే, తుది తీర్పునకు లోబడి ఆళ్లగడ్డ ఫలితం ఉంటుందని చెబుతూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, శోభా నాగిరెడ్డి గత నెల 24వ తేదిన కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి రోజు ఆమె హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శోభా.... వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున ఆళ్లగడ్డ అసెంబ్లీ బరిలో ఉన్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications