శోభా ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్, పార్టీ వేరైనా: నన్నపనేని
శోభా ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని చెప్పారు. ఆమెకు అత్యవసర సేవల విభంగాలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని పరీక్షిస్తున్నామన్నారు. సిటీ స్కాన్, ఎమ్మార్ తదితర పరీక్షలు చేసినట్లు చెప్పారు. కాగా, శోభా నాగిరెడ్డికి పక్కటెముకలు విరిగి చాతిలోకి చొచ్చుకెళ్లినట్లు సమాచారం. మెడమీద కూడా గాయాలయ్యాయి. మల్టిపుల్ గాయాలు ఉన్నట్లు వైద్యులు చెప్పారు. హృదయ స్పందన, బిపి, పల్స్ రేట్ నార్మల్గానే ఉన్నాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి విషయమై ఇప్పుడే ఏమీ చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు.
అనుబంధం: నన్నపనేని
రోడ్డు ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లిన శోభా నాగిరెడ్డి చికిత్స పొందుతున్న కేర్ హాస్పిటల్కు టిడిపి ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి వచ్చారు. శోభ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
తమ పార్టీలు వేరు అయినా, వీరితో ఉన్న అనుబంధంతోనే ఇక్కడకు వచ్చానని చెప్పారు. శోభ, ఆమె తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి, భర్త నాగిరెడ్డితో కలసి తాను పని చేశానని గతంలో అందరం ఒకే పార్టీలో ఉన్నామన్నారు. వారి కుటుంబానికి, తన కుటుంబానికి చాలా అనుబంధం ఉందన్నారు. ఆ అనుబంధంతోనే ఇక్కడకు వచ్చానని చెప్పారు. రాత్రివేళ ప్రయాణాలు రద్దు చేసుకోవాలని, వేగంగా వెళ్లవద్దని చెప్పారు.