తిరుమలలో తెరిపిలేని వర్షం: బెజవాడ జలమయం

కనుమ రహదారుల్లో నిరాకటంకంగా కురుస్తున్న వర్షంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వామి వారి దర్శనం పూర్తయిన యాత్రికులు ఆలయం నుంచి వర్షంలో తడుస్తూనే గదులకు చేరుకుంటున్నారు. పిల్లలు, వృద్ధులు చలికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కనుమ రహదారుల్లో కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇదిలావుంటే, విజయవాడ నగరంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు రెండు గంటలుగా ఎడపతెరపి లేకుండా కురిసిన వర్షాలకు వాహనదారులు ఇక్కట్లకు గురయ్యారు. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిశాయి. మరో రెండు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు ప్రకాశం జిల్లాలో వర్షాల కారణంగా ఒంగోలు, కందుకూరు, కొండేపి, సంతనూతల పాడు, మార్కాపురం, కనిగిరి తదితర ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి.












Click it and Unblock the Notifications