వాన బీభత్సం: విరిగిన చెట్లు, బాలుడి మృతి(పిక్చర్స్)
చిత్తూరు: జిల్లాలోని తిరుపతి, తిరుమల ప్రాంతాల్లోనే కాకుండా జిల్లాలో పలు ప్రాంతాల్లో బుధవారం గాలి, వాన బీభత్సం సృష్టించాయి. దీంతో పలుచోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. రోడ్లన్నీ జలమయ్యాయి. శేషాచల కొండల్లో పలుచోట్ల పిడుగులు పడ్డాయి.
అలిపిరి నుంచి తిరుమల కాలినడక మార్గ మధ్యంలో ఉన్న గాలి గోపురానికి సమీప అటవీప్రాంతంలో పిడుగులు పడి మంటలు చెలరేగాయి. తిరుమల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఉరుములు, మెరుపులు గాలితో కూడిన వాన కురిసింది.
శ్రీవారి ఆలయం లోతట్టుగా ఉండటంతో వర్షపు నీరు ఆలయ మహాద్వారా నుంచి ధ్వజ స్థంభం మధ్య ఉన్న రంగనాయక మండపం ముందు వరకు భారీగా చేరింది. దీంతో అధికారులు కొంత సేపు స్వామివారి దర్శనాన్ని నిలిపివేశారు. తిరుపతిలో మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి గాలివాన సృష్టించిన బీభత్సంతో పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి.
కొర్లగుంట నవోదయ కాలనీలో వర్షం పడుతున్న సమయంలో మురుగునీటి కాలువలో పడ్డ బంతిని తీసుకోవడానికి వెళ్లిన సురేష్ అనే బాలుడు ప్రమాదవశాత్తూ కాలువలో పడి మృతి చెందాడు. వరదనీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన అతడి మృతదేహాన్ని కొంతదూరంలో గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించారు. బాలడి మృతితో కుటుంబసభ్యులు తీవ్రంగా రోదించారు.
గాలి, వాన బీభత్సం
చిత్తూరు జిల్లాలోని తిరుపతి, తిరుమల ప్రాంతాల్లోనే కాకుండా జిల్లాలో పలు ప్రాంతాల్లో బుధవారం గాలి, వాన బీభత్సం సృష్టించాయి.
గాలి, వాన బీభత్సం
దీంతో పలుచోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. రోడ్లన్నీ జలమయ్యాయి. శేషాచల కొండల్లో పలుచోట్ల పిడుగులు పడ్డాయి.
గాలి, వాన బీభత్సం
అలిపిరి నుంచి తిరుమల కాలినడక మార్గ మధ్యంలో ఉన్న గాలి గోపురానికి సమీప అటవీప్రాంతంలో పిడుగులు పడి మంటలు చెలరేగాయి.
గాలి, వాన బీభత్సం
తిరుమలలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఉరుములు, మెరుపులు గాలితో కూడిన వాన కురిసింది.
గాలి, వాన బీభత్సం
తిరుపతిలో మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి గాలివాన సృష్టించిన బీభత్సంతో పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి.
గాలి, వాన బీభత్సం
తిరుమలలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఉరుములు, మెరుపులు గాలితో కూడిన వాన కురిసింది.
గాలి, వాన బీభత్సం
చిత్తూరు జిల్లాలోని తిరుపతి, తిరుమల ప్రాంతాల్లోనే కాకుండా జిల్లాలో పలు ప్రాంతాల్లో బుధవారం గాలి, వాన బీభత్సం సృష్టించాయి. దీంతో పలుచోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి.
గాలి, వాన బీభత్సం
రోడ్లన్నీ జలమయ్యాయి. శేషాచల కొండల్లో పలుచోట్ల పిడుగులు పడ్డాయి.
గాలి, వాన బీభత్సం
అలిపిరి నుంచి తిరుమల కాలినడక మార్గ మధ్యంలో ఉన్న గాలి గోపురానికి సమీప అటవీప్రాంతంలో పిడుగులు పడి మంటలు చెలరేగాయి.
గాలి, వాన బీభత్సం
తిరుమల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఉరుములు, మెరుపులు గాలితో కూడిన వాన కురిసింది.
బాలుడి మృతి
కొర్లగుంట నవోదయ కాలనీలో వర్షం పడుతున్న సమయంలో మురుగునీటి కాలువలో పడ్డ బంతిని తీసుకోవడానికి వెళ్లిన సురేష్ అనే బాలుడు ప్రమాదవశాత్తూ కాలువలో పడి మృతి చెందాడు.
బాలుడి మృతి
వరదనీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన అతడి మృతదేహాన్ని కొంతదూరంలో గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించారు. బాలుడి మృతితో కుటుంబసభ్యులు తీవ్రంగా రోదించారు.