అవినీతి డబ్బుతో మంత్రులు విలాసాలు.. నానికి బాసటగా సిద్ధార్థ్.. జగన్ సర్కార్పై సెటైర్లు
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల ధర వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపుతోంది. అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అటు టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు, థియేటర్స్ యజమాన్యాలు సైతం జగన్ ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. టీ కప్పు కూడా రాని ధరకు సినిమా టికెట్ ధరను ఫీక్స్ చేశారంటూ మండిపడుతున్నారు. శ్యామ్ సింగరాయ్ మీడియా సమావేశం సందర్భంగా ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపుపై హీరో నాని అసహనం వ్యక్తం చేశారు. దీనిపై మంత్రులు సైతం నానికి కౌంటర్ ఇచ్చారు. అయితే నాని వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లుగానే.. తాజాగా హీరో సిర్థార్థ్ మంత్రులపై సెటైర్లు విసిరారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమైయ్యాయి.
విలాసాలు తగ్గించి.. మాకు సబ్సిడీలు ఇవ్వండి..
ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపుపై ట్విట్టర్ వేదికగా హీరో సిద్ధార్థ్ విరుచుపడ్డారు. సినిమా ఖర్చు తగ్గించి , కస్టమర్స్కు డిస్కౌంట్ అందిస్తున్నామంటున్నారు మంత్రులు. కాని సినీ పరిశ్రమలో పనిచేసే మేమంతా ప్రభుత్వానికి లెక్కలతో సహా చూపించి పన్నులు కడుతున్నానామన్నారు. రాజకీయ నేతల మాత్రం ఎలాంటి టాక్స్ లు లేకుండా విచ్చలవిడిగా సంపాదిస్తున్నారు. దుర్మార్గంగా ప్రజల డబ్బులను దోచుకుంటున్నారు.. అవితీతి చేసి లక్షల కోట్లు సంపాధించుకుంటున్నారని ఆరోపిస్తూ ట్విట్ చేశారు. కానీ మేము ప్రతిది లెక్క చూపించి టాక్స్ కడుతున్నామన్నాం.. మీ విలాసాలను కొస్త తగ్గించుకోనీ మాకు సబ్సిడీలు ఇవ్వండి అంటూ ట్విట్ చేశారు సిద్ధార్థ్.

ఏ మంత్రుల గురించి..
అయితే సిద్ధార్థ్ తన ట్వీట్లో ఏ మంత్రుల గురించి అంటున్నది ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ప్రస్తుతం ఏపీలో సినిమా టికెట్ల రేటు వివాదం నడుస్తోంది. సినీ పరిశ్రమలోని పలువురు జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో సిద్ధార్థ కూడా ఏపీ మంత్రులనే ఉద్దేశించి మాట్లాడని నెటిజన్లు ఆయనకు రీ ట్విట్ చేస్తున్నారు.

నాని వర్సెస్ మంత్రులు
శ్యామ్ సింగరాయ్ మీడియా సమావేశంలో హీరో నాని ఏపీలో టికెట్ ధర తగ్గింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు . ప్రభుత్వ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు అనే విషయాన్ని పక్కన పెడితే టికెట్ల ధర తగ్గింపు ప్రేఓకుల్ని అవమానించేలా ఉందన్నారు. థియేటర్ల కంటే పక్కన ఉండే కిరాణా షాపుల కలెక్షన్ ఎక్కువగా ఉన్నాయన్నారు. సినిమా టికెట్ల ధరలు పెంచినా ప్రేక్షకులకు కొనే సామర్థం ఉందని పేర్కొన్నారు

మంత్రులు కూడా కౌంటర్
నాని వ్యాఖ్యలపై అటు మంత్రులు కూడా కౌంటర్ ఇచ్చారు. సినిమా టిక్కెట్ల ధరలను అడ్డగోలుగా పెంచడం సరికాదని మంత్రి బొత్స అన్నారు. సబ్బులు, బిస్కెట్లకు ఎమ్మార్పీ రేట్లు ఉన్నప్పుడు సినిమా టికెట్లకు ధర ఉంటే తప్ప ఏమిటని మంత్రులు నిలదీశారు. అందరి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉంటుందని మంత్రులు పేర్కొన్నారు. ఏమైనా అభ్యంతరాలుంటే ప్రభుత్వానికి తెలియజేయాలని థియేటర్ల యాజమాన్యాలకు సూచించారు. మరి సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు ఏలా స్పందిస్తారో చూడాలి.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications