ఏపీ సచివాలయంలో హై అలెర్ట్.. పోలీసుల తనిఖీలు.. డేటా చోరీ జరిగిందా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఎన్నికల ఫలితాలలో టిడిపి కూటమి విజయం సాధించడంతో రాష్ట్రంలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. నిన్న తెలుగుదేశం కూటమి మెజారిటీ స్థానాలలో విజయకేతనం ఎగురవేయడంతో, ఏపీలో పాలనా పగ్గాలను చేపట్టడానికి సిద్ధమైన చంద్రబాబు నిన్ననే సీఎం ఆఫీస్ ను తన అధీనంలోకి తీసుకుని 2019 నుంచి 2024 వరకు ఉన్న ఫైల్స్ బయటకు పోకూడదని ఆదేశాలు జారీ చేశారు.
సచివాలయంలోని ఐటీ విభాగంలో పోలీసుల తనిఖీలు
ఇక ఏపీలోనూ తెలంగాణా తరహాలో డేటా చోరీ జరుగుతుందని, తెలంగాణా తరహాలో ఏపీలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, సజ్జల రామకృష్ణా రెడ్డి నేతృత్వంలో చేశారని డొక్కా మాణిక్య వరప్రసాద్ వంటి నేతలు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో తాజాగా సచివాలయంలోని ఐటి విభాగంలో నేడు పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

డేటా చోరీ చేయడానికి, డిలీట్ చేయడానికి ప్రయత్నాలు.. ఆరోపణలు
ఐటీ విభాగంలో ఉన్న కంప్యూటర్ల నుంచి డేటా చోరీ చేయడానికి, డిలీట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం పోలీసుల తనిఖీలపైన ఆసక్తి నెలకొంది. అమరావతిలోని సచివాలయం నుంచి డేటా చోరీ అవుతుందా? ఐటీ వింగ్ నుండి డేటా బయటకు వెళుతుందా? అన్న చర్చలు ఏపీలో జరుగుతున్న వేళ ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు.
ఐటీ వింగ్ వద్ద భారీ బందోబస్తు
డేటా బయటకు వెళ్లకుండా, అనుమానం ఉన్న చోట తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఐటీ వింగ్ ఎస్పీ నేతృత్వంలో సోదాలు చేయడంతో పాటు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ఫైలింగ్ ద్వారా నడుస్తున్న ఫైల్స్ అన్నింటినీ భద్రపరిచే వింగ్ వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఉద్యోగుల నుండి పెన్ డ్రైవ్ లు, డేటా హార్డ్ డిస్క్ ల స్వాధీనం
అధికారం మారుతున్న నేపథ్యంలో, డేటా బయటకు వెళ్లే అవకాశం ఉందన్న అనుమానంతో ఉద్యోగుల నుండి పెన్ డ్రైవ్ లు, డేటా హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పటికే డేటా చోరీ జరిగిందా? లేదంటే ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా పోలీసుల తనిఖీలు జరుగుతున్నాయా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే గతంలో చంద్రబాబు జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ-ఫైలింగ్ విధానాన్ని వ్యతిరేకించిన క్రమంలో తాజాగా ఈ విభాగంలో దాడులు కొనసాగటం ఆసక్తిని కలిగిస్తుంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications