కోడెల విజయలక్ష్మికి హై కోర్టులో షాక్.. ముందస్తు బెయిల్ నిరాకరణ
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తే దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే తనపై గుంటూరు జిల్లా నరసరావు పేట లోని పోలీస్ స్టేషన్లలో తనపై నమోదైన కేసులు అక్రమని పేర్కోనడంతో వాటిని కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో వాటికి సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే దినిపై విచారణ చేపట్టిన హైకోర్టు కేసులకు విచారించిన న్యాయస్థానం ఆమే పటిషన్ను తోసిపుచ్చారు. అనంతరం ముందస్తు బెయిల్కు నిరాకరించారు.
కాగా కోడేల కూతురు విజయలక్ష్మిపై ఓ భూకబ్జా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయడు, కొనుగోలు చేసుకున్న భూమిని కాజేసేందుకు ఆమె ప్రయత్నించినట్టు ఆరోపణలు వచ్చాయి. మారుతి ప్రసాద్ అనే టీచర్, 1.45 ఎకరాల భూమిని కొనుగోలు చేయగా, ఆ భూమి తమదేనంటూ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి, భూమిని వదిలి వెళ్లాలంటూ తనను విజయలక్ష్మి బెదిరించారని బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.ఈ నేపథ్యంలోనే సెటిల్ మెంట్ చేసుకుందామని పిలిపించి, రూ. 11 లక్షలు వసూలు చేశారని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా అంతకు ముందు కూడ భూకబ్జా ,బలవంతపు బెదిరింపులు, వసూళ్లకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. మరోవైపు బుజ్జి వెంకాయమ్మ అనే మహిళ ఫిర్యాదుతో తనపై చీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు అయ్యాయి.
ఇక వీటికి సంబంధించి పది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విజయ లక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. తనపై పెట్టిన అక్రమ కేసులు కొట్టివేయాలని తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే విషయంపై తీర్పును రిజర్వ్లో ఉంచిన కోర్టు నేడు తీర్పును వెలువరించింది.