బియాస్ ట్రాజెడీ: టి ప్రభుత్వంపై అసహనం, గర్వంగా...
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ నదిలో జరిగిన దుర్ఘటన పైన తెలంగాణ ప్రభుత్వం సరిగా స్పందించలేదని గల్లంతైన విద్యార్థి ఆశిష్ సోదరుడు భరద్వాజ్ బుధవారం ధ్వజమెత్తారు. ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా.. గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు ఈ ప్రభుత్వం అక్కడి వారిపై ఒత్తిడి తేలేకపోయిందన్నారు.
చిలకలగూడకు చెందిన ఆశిష్ మంతా బియాస్ నదిలో గల్లంతైన విషయం తెలిసిందే. ఆశిష్ సోదరుడు భరద్వాజ్ బుధవారం తన ఇంటివద్ద మీడియాతో మాట్లాడారు. ఘటన జరిగి నాలుగురోజులు అవుతున్నా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు.

ఘటనాస్థలికి వెళ్లిన హోంమంత్రి గాలింపునకు సరైన చర్యలు తీసుకునేలా చూడాల్సింది పోయి.. శవాలు, బాడీలంటూ మాట్లాడుతున్నారని, ఇది తమకు తీవ్ర ఆవేదన కలిగిస్తోందని కన్నీరు పెట్టుకున్నారు.
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగి నాలుగు రోజులు కావొస్తున్న ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను మాత్రమే కనిపెట్టారని, దీన్ని బట్టి గాలింపు చర్యలు ఎంత నెమ్మదిగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చునని ఆవేదన వ్యక్తం చేశారు. నదిలో కొట్టుకుపోతున్న ఇద్దరు అమ్మాయిలను కాపాడి, తన తమ్ముడు గల్లంతయ్యాడని అటువంటి తమ్ముడు ఉండటం గర్వకారణమన్నారు.
హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం ఐదో రోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వైస్ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని, సహాయక సిబ్బంది చేరుకోలేని ప్రాంతాల్లో మానవ రహిత ఏరియల్ వెహికల్తో అన్వేషణ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ... విద్యార్థుల మృతదేహాలను త్వరగా వెలికితీసేందుకు చర్యలు తీసుకున్నారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications